టాలీవుడ్ ఇండస్ట్రీలో “మా” అధ్యక్ష ఎన్నికలు ఈరోజు మధ్యాహ్నం ముగియటంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఓటింగ్ శాతం పెరగడంతో.
ఎవరు “మా” అధ్యక్ష పదవి అధిరోహిస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది.ఇదిలా ఉంటే పోస్టల్ బ్యాలెట్ లో పోలైన ఓట్లలో 50 చెళ్లనివిగా గుర్తించడం జరిగింది.
మోహన్ బాబు అదేరీతిలో మురళీమోహన్ సమక్షంలో జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియ లో ప్రారంభం లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి చెందిన నలుగురు సభ్యులు గెలవడం జరిగింది.శివారెడ్డి, కౌశిక్.
విజేతలుగా నిలిచారు.ఆ తర్వాత అనసూయ.
సురేష్ కొండేటి విజయం సాధించడం జరిగింది.
ఇటువంటి తరుణంలో తాజాగా.విష్ణు ప్యానల్ కి చెందిన సభ్యులు వెనకబడి పోతున్నట్లు.వార్తలు వచ్చిన క్రమంలో ఊహించని విధంగా ఏకంగా ఎనిమిది మంది విష్ణు ప్యానల్ కి చెందిన అభ్యర్థులు విజయం సాధించడంతో విష్ణు… అందరి కంటే ముందంజ లో దూసుకుపోతున్నట్లు వార్తలు అందుతున్నాయి.
ప్రస్తుతం ఈసీ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు పూర్తిగా అనంతరం ఆఫీస్ బేరర్ ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు తెలుస్తోంది.