ఏం చేసినా కూడా పొట్ట కూటి కోసమే అనేది పెద్దలు చెప్పే మాట.అయితే కొందరు విలాసాల కోసం కష్టపడుతూ ఉంటే మరి కొందరు కుటుంబం కోసం కష్టపడుతూ ఉంటారు.
మరి కొందరు ఇతరుల కోసం కష్టపడుతూ ఉంటారు.మొత్తానికి మనిషి జీవితంలో కష్టపడితేనే గౌరవం దక్కుతుంది.
ఏదైనా పని చేస్తూ చనిపోయినా కూడా అతడికి మంచి గుర్తింపు ఉంటుంది.కాని కొందరు లేజీగా ఏ పని చేయకుండా తిరుగుతూ ఉంటారు.
అలాంటి వారు సిగ్గు పడాల్సిన కథనం ఇది.నేపాల్కు చెందిన కొన్ని గ్రామాలకు చెందిన ప్రజలు ప్రాణాలకు తెగించి కష్టపడుతున్నారు.వారి గురించి ఇప్పుడు తెలుసుకుంది.
హిమాలయాలకు సమీపంలో ఉండే నేపాల్కు చెందిన కొందరు గ్రామస్తులు ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు కొండల్లో ఏదో వెతుకుతూనే ఉంటారు.చిన్నా పెద్దా అనే తేడా లేకుండా యార్సాగుంబా అనే మూలిక కోసం వెదుకుతూనే ఉంటారు.శృంగార సామర్థ్యంను పెంచే అద్బుతమైన ఔషదంగా దీనికి పేరు.
అందుకే దీన్ని నేపాలీ వయాగ్రా అని కూడా అంటారు.నేపాల్కు చెందిన వ్యాపారులు దీన్ని స్థానికుల నుండి కిలో అయిదు లక్షల చొప్పున కొనుగోలు చేసి విదేశాలకు ఆరు నుండి ఏడు లక్షలకు అమ్ముతూ ఉంటారు.
పర్వాతాల మద్యలో, మంచు కొండల్లో ఈ మొక్క ఉంటుంది.15 నుండి 30 ఇంచులు ఉన్న చెట్లను సేకరించాల్సి ఉంటుంది.అందుకోసం పిల్లలు పెద్దలు అంతా వెళ్తారు.ఇటీవల ఈ వయాగ్రా మొక్కల కోసం వెళ్లిన 8 మంది మృత్యువాత పడ్డారు.అందులో ఇద్దరు పిల్లలు కూడా ఉండటం సోచనీయం.వందలాది మంది ప్రతి రోజు పర్వతాల్లోకి వెళ్లి అక్కడ వెదుకుతూ ఉంటారు.
గత పది సంవత్సరాల్లో వందలాది మంది మృతి చెందినట్లుగా స్తానికులు చెబుతున్నారు.అయినా వారి ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు.