భారీగా వర్షం పడితేనే కొన్ని ఇళ్లు, పురాతన కట్టడాలు కుప్పకూలిపోతున్న రోజులు ఇవి.వాటికీ సంబందించిన కొన్ని ఘటనలను కూడా మనం చూశాం.
అలాంటిది చైనాలోని నదీ తీరంలో గల ఓ రాతి కొండ మీద నిర్మించిన 700 ఏళ్ల నాటి బౌద్ధ ఆలయం ఎన్ని వరదలు వచ్చిన సరే చెక్కు చెదరలేదు అంటే నమ్మండి.
ఆ ఆలయంకు వరదలు కొత్త కాదు కానీ గతంతో పోలిస్తే ఈ వరద చాలా పెద్దది.
అయినా సరే ఆ ఆలయానికి సంబంధించి ఒక్క ఇటుక కూడా కదల్లేదు అంటే ఎంత గొప్ప ఆలయమో మీరే చుడండి.ఆ ఆలయంను చూసి సామాన్య ప్రజలు సైతం ఆశ్చర్యపోతన్నారు .భారీ వర్షాల వల్ల చైనాలోని నదులు ఉప్పొంగుతున్నాయి.
రిజర్వాయర్లు నిండు కుండను తలపిస్తున్నాయి.ముఖ్యంగా మధ్య, తూర్పు చైనాలో వరద తీవ్రత ఎక్కువగా ఉంది.అయినా సరే ఆ ఆలయం చెక్కు చెదరలేదు.
ఇంకా ఈ ఆలయం కరోనాకు కేంద్రం అయినా వుహాన్ నగరంలోని యాంగ్జీ నదిలో ఓ రాతి దీపంపై 700 ఏళ్ల కిందట బౌద్ధ ఆలయం నిర్మించారు.ఇంకా ఈ ఆలయం 1998 లో ఏర్పడిన భారీ వరదలకే ద్వాంసమవుతుంది అని అందరూ భావించారు.
కానీ 2020 సంవత్సరంలో ఇంత పెద్ద వరద వచ్చిన చెక్కు చెదరలేదు ఈ ఆలయం.