మామూలుగా ఎవరైనా వ్యక్తులు ఏదైనా వివాదాల్లో చిక్కినప్పుడు గాని లేదా రాజకీయ నాయకులు తమ రంగంలో సంబంధించిన గొడవలకు కానీ ఏదైనా కేసు లు ఉంటాయి.అంతేకాకుండా ఒకటి, రెండు లేదా మూడు కంటే ఉండటమే చాలా కష్టంగా ఉంటాయి.
కానీ ఓ నటికి ఎటువంటి రాజకీయ పరంగా పరిచయం కూడా లేదు.అలాంటిది ఆ నటిపై ఏకంగా 700 కేసులు ఉన్నాయట.
ఇంతకీ ఆమె ఎవరో కాదు.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్.
ఈమె నటిగా కాకుండా తన వ్యక్తిగత విషయంలో అభిమానులకు ఎక్కువగా దగ్గరయ్యింది.అంతే కాకుండా ముక్కుసూటి మనిషిగా నిలిచింది.
తన నటన పట్ల ఎంతో ఆసక్తి చూపించడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా వివాదాల పట్ల అంతే ఆసక్తి చూపుతుంది.ఇదిలా ఉంటే తనపై అన్ని కేసులు ఉన్నాయంటూ ఆమెనే తెలిపింది.
బాలీవుడ్ సినీ పరిశ్రమలో గత కొన్ని ఏళ్ల నుంచి కంగనా బాగా వివాదాల్లో చిక్కుకుంటుంది.సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయం పై వెంటనే తలదూరుస్తుంది.అలా వార్తల్లో నిలుస్తుంది.గత ఏడాది నుంచి ఎక్కువగా రాజకీయాల వివాదాల పట్ల దృష్టి పెడుతుంది.
మహారాష్ట్రలో శివసేన పార్టీ ను టార్గెట్ చేయడం, నరేంద్ర మోడీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉన్న వాళ్లందరి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ అనవసరంగా వివాదాల్లో చిక్కుతుంది.
అంతే కాకుండా సినీ పరిశ్రమలో ఉన్న కొందరిని దృష్టికి తీసుకొని వారి గురించి కొన్ని గొడవలు చేయడం అలవాటుగా మార్చుకుంది.ఇక వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న వాళ్ళు అందరితోనూ వాదనలకు దిగడం.నువ్వు ఇప్పుడు రైతులు బిల్లులకు వ్యతిరేకంగా చేసిన ఆందోళన గురించి వాళ్ళ పై కూడా ఒక పద్ధతి లేకుండా మాట్లాడటం ఇలా ఎన్నో వివాదాలో చిక్కుకుంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతుంది కంగనా.
తాజాగా కంగనా తన ట్విట్టర్లో ఒక ట్వీట్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది.తన ఇంట్లో తరచుగా సమావేశాలు నిర్వహిస్తున్నానని, తనపై ఏకంగా 700కు పైగా కేసులు నడుస్తున్నాయని తెలిపింది.
అంతేకాకుండా తన మీద ఉన్న కేసులన్నీ అక్ష్ రనౌత్ డీల్ చేస్తుందని తెలిపింది.ఇక వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్న వారిని మాత్రం విడిచిపెడుతున్నాంటూ తెలిపింది
.