మున్నేరు వరద ప్రవహిస్తుండడంతో ఇసుక ర్యాంపుల్లో చేరిన నీరు .కృష్ణా నదిలో చిక్కుకున్న 70 లారీలు.
రాష్ట్రంలో ఇసుక కొరత ఎక్కువ అయింది.ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో జనాల్లో ప్రభుత్వంపై కాస్త వ్యతిరేకత వచ్చింది.
తో ప్రభుత్వమే ఇసుక ర్యాంకులను ఏర్పాటు చేసి ఇసుక సరఫరా చేస్తుంది.వివరాల్లోకి వెళితే కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గం లోని చెవిటికల్లు వద్ద కృష్ణానదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది.
మున్నేరు వరద ప్రవహిస్తుండడంతో ఇసుక ర్యాంపుల్లో చేరిన నీరు దీంతో నదిలో ఇసుక కోసం వెళ్లిన 70 లారీలు వరదల్లో చిక్కుకున్నాయి.అనుకోకుండా సడన్ గా అకస్మాత్తుగా చెవిటికల్లు వద్ద ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది వరదతో కూడా కొంతమేర రహదారి దెబ్బతింది.
దీంతో లారీలు అన్ని తిరిగి వెనక్కి వెళ్ళలేని పరిస్థితి.నీరు ఉద్రిక్తంగా పెరగడతో లారీలు అన్ని అక్కడే నిలిచిపోయాయి.ఈ ఘటనతో లారీ డ్రైవర్లు యజమానులు భయఆందోళన చెందుతున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు రెవెన్యూ అగ్నిమాపక సిబ్బంది చెవిటికల్లు వద్ద కృష్ణానది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
లారీలను కృష్ణానది ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. చెవిటికల్లు వద్ద కృష్ణానదిలో ఇసుక ర్యాంకుల వరద ఉధృతి పెరిగింది .బయటకు వచ్చే వీలు లేక కృష్ణా నదిలో నుంచి లారీ డ్రైవర్లులను, కూలీలను అగ్నిమాపక శాఖ అధికారులు పడవల్లో ఒడ్డుకు చేర్చుతున్నారు.