ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు అంటారు.ఈ మాట అక్షరాల నిజం.
ప్రస్తుతం ధనం చుట్టూనే లోకం తిరుగుతోంది.సంపాదన, ఆస్తులు సమకూర్చుకోవడం అనేవి అందరి వ్యక్తిగత విషయాలు.
చదువు కెరీర్ డబ్బు సంపాదన అంటూ ఉరుకుల పరుగుల జీవితం గడుపుతున్నారు ఇప్పుడందరూ.కానీ కొందరు ఎంత సంపాదించినా వారి దగ్గర డబ్బు నిలవదు.
కానీ కొన్ని పద్దతులు పాటిస్తే ఆర్దిక స్తిరత్వం లభిస్తుంది.ఇవన్నీ నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం.ఎందుకంటే ఇవి విశ్వాసాలకు సంభందించినవి.
1.లక్ష్మీ దేవికి బియ్యంతో పూజ చేసి అందులో కొంత బియ్యాన్ని దగ్గర ఉంచుకుంటే ధనం బాగా సమకూరుతుంది.లక్ష్మీ దేవి ఫొటోను దగ్గర పెట్టుకున్నా, విష్ణువు పాదాలను ముట్టుకున్నా అలాంటి వారికి అంతా మంచే జరుగుతుంది.
వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయట.అంతేకాదు శుక్రవారం రోజు కొబ్బరికాయతో లక్ష్మీ దేవికి పూజ చేసి ఆ కొబ్బరికాయను దగ్గర ఉంచుకోవాలి.ఇలా చేసినా ఆర్థిక సమస్యలు దూరమవుతాయి
2.ఎల్లో కౌరీస్ (Yellow Cowries) అని పిలవబడే ఓ రకమైన గవ్వలను ఏడింటిని తీసుకుని జేబులో పెట్టుకుంటే ఆర్థిక స్థిరత్వం లభిస్తుందట.అంతేకాదు గోమ్తి చక్ర అని పిలవబడే గవ్వలను బేసి సంఖ్యలో దగ్గర ఉంచుకున్నా ఆర్థికంగా లాభం జరుగుతుందట.వీరికి శత్రువుల నుంచి బాధ కూడా తప్పుతుందట.
3.తామరపూవు విత్తనాలను దగ్గర పెట్టుకుంటున్నా ఆర్థిక స్థిరత్వం లభించడమే కాదు ఖర్చులు తగ్గుతాయట.
4.పిప్పళ్ల చెట్టు (రావి చెట్టు) ఆకును ఒక దాన్ని శనివారం పూట తీసుకుని దాని నీటితో శుభ్రంగా కడిగి, ఆ ఆకుపై హ్రీ అని రాసి దగ్గర ఉంచుకోవాలి.ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.
5.రూ.20 నోటు ఒకటి, రెండు రూపాయి నోట్లు తీసుకుని వాటిని వెండి తీగతో కలిపి చుట్టి తెలుపు రంగు పర్సులో పెట్టుకోవాలి.ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఖర్చులు తగ్గుతాయి.
6.శ్రీ యంత్రాన్ని ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకున్నా అంతా మంచే జరుగుతుంది.అలాంటి వారికి డబ్బు పరంగా ఉన్న అన్ని సమస్యలు పోతాయి.
7.కోడిగుడ్డు ఆకారంలో ఉండే తెల్లని వైట్ స్టోన్ను దగ్గర ఉంచుకుంటే అది పాజిటివ్ శక్తిని ఇస్తుందట.అలాంటి వారికి ప్రశాంతత కూడా కలుగుతుంది ఆర్దిక సమస్యలు తొలగిపోతాయి.