అత్యంత ప్రతిష్టాత్మక యూనివర్సిటీ అయిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది.ఎంతో ప్రతిభ చక్కని నైపుణ్యం, మేధో శక్తి ఉంటేనే కాని ఈ యూనివర్సిటీలో చోటు దొరకదని అందరికి తెలిసిందే అయితే ఈ యూనివర్సిటీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చే కేంబ్రిడ్జ్ స్కాలర్షిప్-2019 కి ఏడుగురు భారతీయ విద్యార్ధులు ఎంపిక అవ్వడం ఎంతో గర్వించదగ్గ విషయం.
దాదాపు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఎంపికైన 90 మంది పోస్టు గ్రాడ్యుయేట్లలో భారతీయులు ఏడుగురు ఉండటం గమనార్హం.ఈ మేరకు ఎంపికైన విద్యార్ధుల వివరాలని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ఒక ప్రకటన విడల చేసింది.వీరు ఆయా సబ్జెక్టులలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తారని తెలిపింది.అయితే ఈ 90 మందిలో భారతీయ విద్యార్ధుల వివరాలని పరిశీలిస్తే.
నికిత ముమ్మిడివరపు – హిస్టరీ, ఫిలాసఫీ, ధృవ్ నందమూడి – బయాలాజికల్, సైన్సెస్ , అర్జున్ అశోక్ – జెండర్ స్టడీస్, కనుప్రియాశర్మ – క్రిమినాలజీ, రితికా సుబ్రమణియన్ – జెండర్స్టడీస్, అవని వీయిరా – ఆంగ్లం, నిషాంత్ గోఖలే – లీగల్ స్టడీస్ లు ఎంపిక అయినట్టుగా తెలిపారు.