కరోనా వైరస్.చైనాలో వుహాన్ లో పుట్టిన ఈ దారుణమైన వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికించేస్తోంది .
కరోనా అని పేరు చెప్పగానే ప్రపంచమంతా గజ గజ వణికిపోతుంది.అలా వణికించే ఈ కరోనా వైరస్ కు ప్రస్తుతం మందు లేకపోవడంతో ఈ వైరస్ భారిన పడినవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు.
ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా భారిన ఎంతమంది పడ్డారు? ఎంతమంది మరణించారు అని సర్వే చెయ్యగా.విస్తుపోయే నిజాలు ఆ సర్వేలో బయట పడ్డాయి.
ఆ కరోనా వైరస్ ఎంత డేంజర్ అసలు అని అనిపించేస్తాయి ఆ నిజలు.అంతటి దారుణమైన నిజాలు ఆ సర్వేలో వెల్లడి అయ్యాయి.
మునుపెన్నడూ ఇలాంటి రాక్షస వైరస్ రాలేదు.ప్రపంచవ్యాప్తంగా కరోనా భారిన ఎంతమంది పడ్డారు అంటే సుమారు 69,500 ఈ కరోనా వైరస్ సోకింది.ఇంకా ఈ వైరస్ బలై పోయిన వారి సంఖ్య మరి దారుణంగా ఉంది.కేవలం నెల రోజుల్లో దాదాపు 2వేల మంది ఈ కరోనా వైరస్ బారిన పడి చనిపోయారు.
కాగా ఈ కరోనా వైరస్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘కోవిడ్–19’ పేరు మార్చిన సంగతి తెలిసిందే.