తన తండ్రికి జీతం పెంచండి సార్ అంటూ ఓ చిన్నారి ఏకంగా సీఎంకు లేఖ రాసిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేకు తన ఉత్తరాన్ని చేరవేయాలని ఆ చిన్నారి తన తండ్రిని కోరింది.
ఆ చిన్నారి బాధతో రాసిన లేఖను ఆ తండ్రి సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
జల్నా ప్రాంతానికి చెందిన శ్రియా పరాలే అనే ఆరేళ్ల చిన్నారి స్థానిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతోంది.
తన తండ్రి అంబాద్ డిపోలో బస్ కండక్టర్గా ఉద్యోగం చేస్తున్నాడు.దీంతో తన తండ్రి జీతం తక్కవగా ఉండటంతో, ఎక్కువగా డ్యూటీలోనే ఉంటున్నాడని, తనతో సమయం గడపడం లేదని ఆ చిన్నారి బాధతో ఓ లేఖను మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరేకు రాసింది.
ఆ లేఖను పోస్ట్ చేయాలంటూ తన తండ్రికి చెప్పింది.
ఈ లేఖకు సంబంధించిన వివరాలను ఆ తండ్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
తన కూతురు మరాఠీలో రాసిన లేఖను సీఎంకు చేరిందో లేదో తనకు తెలియదని ఆ తండ్రి పేర్కొన్నాడు.తన తండ్రి జీతం పెంచాలంటూ ఆ చిన్నారి లేఖను రాసిన ఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.