టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న పెద్ద ప్రొడక్షన్ కంపెనీలలో సురేష్ ప్రొడక్షన్ కూడా ఒకటి.సురేష్ ప్రొడక్షన్ లో ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి.
అయితే చాలా కాలంగా నిర్మాణంకి దూరం గా ఉన్న సురేష్ ప్రొడక్షన్ చిన్న సినిమాలని కొని రిలీజ్ చేస్తూ ఉంది.ఇలా రిలీజ్ చేసిన సినిమాల ద్వారా సురేష్ బాబు గట్టిగానే సంపాదించాడు.
పెళ్లి చూపులు సినిమా నుంచి మొన్న కేరాఫ్ కంచరపాలెం సినిమా వరకు కంటెంట్ బాగున్న లో బడ్జెట్ సినిమాలకి అండగా నిలబడుతూ రిలీజ్ చేసే బాద్యత తీసుకుంటున్నారు.ఇప్పుడు కూడా సురేష్ ప్రొడక్షన్ చేతిలో ఏకంగా ఆరు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓ బేబీ’, అల్లు శిరీష్ ‘ఏబీసీడీ’, శ్రీ విష్ణు, నివేదా థామస్ ‘బ్రోచేవారెవరురా’, ఆనంద్ దేవరకొండ, శివాత్మిక ‘దొరసాని’ చిత్రాలతో పాటు, ఫలక్నుమాదాస్, మల్లేశం సినిమాలు సురేష్ ప్రొడక్షన్స్ ద్వారానే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.ఈ ఆరు చిత్రాలలో మూడు చిత్రాలు రీమేక్ చిత్రాలు కావడం విశేషం.
ఒకే ప్రొడక్షన్ సంస్థ నుండి వరుసగా ఆరు చిత్రాలు విడుదలకి రెడీ కావడం తెలుగు ఇండస్ట్రీ చరిత్రలో ఇదే మొదటి సారి అని చెప్పాలి.ఇక ఈ సినిమాలో చాలా వరకు ఎక్స్ పెక్టేషన్స్ తో రిలీజ్ అవుతున్నాయి.
మరి వీటిలో ఇది బెస్ట్ మూవీ అవుతుందో వేచి చూడాలి.