ఇంటర్నెట్ పరిధి అమాంతం పెరిగిన నేపథ్యంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో కూడా స్మార్ట్ ఫోన్లు ఉంటాయి.స్మార్ట్ ఫోన్ల కారణంగా పెద్ద ఎత్తున ఇంటర్నెట్ వినియోగం పెరిగి పోయింది.
రెండేళ్ల క్రితంతో పోల్చితే ఇండియాలో ఇంటర్నెట్ రేట్లు దాదాపు 90 శాతం తగ్గాయి.దాంతో విచ్చలవిడిగా యువత ఇంటర్నెట్ను వాడేస్తున్నారు.
సగటున యువత ప్రతి రోజు ఒక జీబీ ఇంటర్నెట్ను వాడుతున్నట్లుగా ఒక టెక్నాలజీ సంస్థ తెలియజేసింది.తాజాగా ఇండియాలో ఒక ప్రముఖ సంస్థ సర్వే నిర్వహించింది.
ఆ సర్వేలో అవాక్కయ్యే విషయాలు బయట పడ్డాయి.
ఇండియాలోని మెట్రో నగరాల్లో యువత వాటిని చూడటం మరీ ఎక్కువ అయ్యిందట.
మూడు సంవత్సరాలతో పోల్చితే ఇప్పుడు వాటిని చూసే వారి సంఖ్య దాదాపు 200 రెట్లు పెరిగిందని అంటున్నారు.ఇండియాలో ఉన్న మొత్తం యువతలో 35 శాతం యువత వాటిని చూస్తున్నారట.
ఇక మెట్రో నగరాల్లో ఉన్న యువత మొత్తంలో 60 శాతంకు ఎక్కువగా వాటిని చూస్తున్నట్లుగా సర్వేలో వెళ్లడయ్యింది.ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ యువత కూడా ఏం తక్కువ కాదని నిరూపించుకున్నారు.
మొత్తం హైదరాబాద్ యువతలో 57 శాతం మంది క్రమం తప్పకుండా తాము వాటిని చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఇంటర్నెట్ తక్కువ రేటుకు వస్తున్న కారణంగా తాము విచ్చల విడిగా వినియోగించుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు.ప్రస్తుతం అమెరికాలో మొత్తంగా 60 శాతం యువత ఆ వీడియోలను చూస్తున్నట్లుగా వెళ్లడయ్యింది.అంటే అమెరికాతో దాదాపుగా సమానమైన శాతంతో హైదరాబాద్ యువత కూడా ఆ వీడియోలను చూస్తూ ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో యువత భవిష్యత్తు ఏంటా అంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇండియాలో పలు ఆ సైట్లను బ్యాన్ చేసినా కూడా ఇంకా ఏదో ఒక మార్గంలో అవి ఇంటర్నెట్లో లభ్యం అవుతూనే ఉన్నాయి.అయితే ఇండియాలో ఆ వీడియోలను చూసేందుకు యువత ఖర్చు పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు.ఫ్రీగా లభించే వీడియోలను మాత్రమే చూస్తున్నారు.
కాని అమెరికాలో అలా కాదు లక్షలకు లక్షలు ఖర్చు చేస్తూ ఉంటారు.ఖర్చు విషయంలో మన యువత ఇంకా అక్కడి వరకు వెళ్లలేదు.
ఈ విషయంలో ఒప్పుకోవాల్సిందే.