ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా ఆడపిల్లల మీద పెరిగిపోతున్న లైంగిక దాడులు, అత్యాచారాలు ఓ వైపు సమాజంలో అందరిని భయపెడుతూ ఉన్నాయి.అసలు ఆడపిల్లని బయటకి పంపించాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి కనిపిస్తుంది.
వయసుతో సంబంధం లేకుండా ఆడపిల్ల కనిపిస్తే పాశవికంగా దాడి చేసి అత్యాచారాలకి పాల్పడుతున్న మగాళ్ల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది.ఓ వైపు ఇలాంటి అత్యాచారాలు చేస్తున్న వారికి శిక్షలు పడుతున్న మరో వైపు ఈ దాడులు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు.
ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణలో బాలికల మిస్సింగ్ సంచలనంగా మారింది.
గతంలో ఈన్నడూ లేని విధంగా గత తొమ్మిది రోజుల వ్యవధిలో తెలంగాణలో ఏకంగా 545 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయినట్లు కేసులు నమోదు అయ్యాయి.
ఇలా మిస్సింగ్ కేసులు ఇప్పుడు పోలీసులకి సవాళ్లుగా మారాయి.ఇలా మిస్సింగ్ అయిన అమ్మాయిల జాబితాలో 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు ఉండటం విశేషం.
ఇలా మిస్ అవుతున్న వారిలో కొంత మంది కావాలని ఇంటి నుంచి వెళ్ళిపోతున్న వారు కాగా మిగిలిన వారిలో ఎందుకు, ఎలా మిస్ అవుతున్నారో అర్ధం కాని విషయంగా ఉంది.ఎన్నడూ లేని విధంగా మొదటి సారి తెలంగాణలో ఇలా ఐదు వందలకి పైగా ఆడవాళ్ళ మిస్సింగ్ కేసులు నమోదు కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.