ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కరోనా విజృంభన రోజురోజుకి మరింత ఎక్కువ అయిపోయింది.దీనితో అసలు మనుషులు ఇంటి నుండి బయటకు రావాలంటే తెగ భయపడుతున్నారు.
అయితే కొందరు దీనినే ఆసరా చేసుకొని జనాన్ని మోసం చేస్తానన్నారు.ఇక ఇలాంటి మనుషుల మూఢ నమ్మకాన్ని ఆసరా చేసుకొని ఒక దొంగ బాబా క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నం చేశాడు.
కానీ, చివరకు ఆయన చేసిన పనికి జైలు పాలయ్యాడు. అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే హైదరాబాదులోని మియాపూర్ పరిధిలోని హఫీజ్ పేట్ చెందిన హనీఫ్ కాలనీకి చెందిన ఇస్మాయిల్ భూత వైద్యునిగా ప్రజలను నమ్మబలికిస్తూ జీవనం కొనసాగించేవాడు.
అయితే తాజాగా ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా ను క్యాష్ చేసుకోవాలని ఆలోచన వచ్చింది.ఇక తక్షణమే తన శిష్యులతో అందరికీ స్థానికంగా ప్రచారం కూడా మొదలు పెట్టాడు ఈ ఘనుడు.
దీనితో అనేక మంది రోగులు అక్కడికి వెళ్లేవారు.వారి ముందు ఇస్మాయిల్ కొన్ని మంత్రాలు చదువుతూ నిమ్మకాయలు మంత్రించి ఇచ్చేవాడు.
దీనితోపాటు కరోనాకు ఇక చికిత్స అవసరం లేదని మాస్క్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదని వారికి తెలియచేస్తూ మనుషులని మాయ చేస్తున్నాడు.
ఇలాంటి వాటిని నమ్మి కరోనా రోగులు ఆ బాబాకు దాదాపు 40 వేల నుంచి 50 వేల రూపాయల వరకు సమర్పించారు.
అలా ఒక నెల కాలంలోనే ఈ దొంగ బాబా లక్షలు గుంజేసాడు.ఇక కరోనా బాబాను నమ్మి వచ్చిన బాధితులు కరోనా తక్కువ కాకపోవటంతో వారు పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసారు.
దీంతో పోలీసులు రంగంలోకి దిగి కరోనా బాబాను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.ఇంకా ఎవరైనా ఈ కరోనా బాబా వల్ల నష్టపోయినవారు పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు.