ఈ మధ్య కాలంలో మనకు సంబంధించిన ఘటనలు ఎలా వెలుగులోకి వస్తున్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కాలం కావడంతో ఎక్కడా లేని పాములన్నీ కూడా బయటకి వచ్చేస్తుంది.
ఇంకా ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది ఘటన చూస్తే ఎవరైనా సరే బెదురుకుంటారు.అంత అంత షాకింగ్ ఘటన ఏంటి అనుకుంటున్నారా.
ఓ ఇంట్లో ఏకంగా 50 కట్లపాములు కనబడ్డయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఆకారం గ్రామానికి చెందిన చిరునాగుల గోపయ్య అనే వ్యక్తి ఇంట్లో గడ్డివాము ఉంది.
ఇంకా ఆ గడ్డివాము నుండి 1 కాదు రెండు కాదు ఏకంగా 40 నుండి 50కిపైగా కట్ల పాములు బయటికి వచ్చాయి.దీంతో ఆ పాముని చూసి ఒక్కసారి అందరూ షాక్ కి గురయ్యారు.
గోపయ్య గట్టిగా అరుస్తూ చుట్టుపక్కల వారిని పిలవడంతో సుమారు పది పాములను చంపేశారు.ఇంక మిగతా పాములన్నీ రాళ్లు, బొరియలు, చెట్ల పొదళ్లలోకి దూరాయని స్థానికులు తెలిపారు.
అయితే ఆ పాములు ఎప్పుడు బయటికొచ్చి ఎప్పుడు ఎవరిని కాటు వేస్తాయోనని, కట్ల పాములు చాలా ప్రమాదకరమని స్థానికులు భయపడుతున్నారు.కాగా గడ్డివామును ఏడాది క్రితం పేర్చి ఉంది అని.ఇంకా దాని కింద బొరియలు కూడా ఉండటంతో ఇటీవల కురిసిన వర్షాలకు పాములు అందులో చేరి పిల్లలు చేసి ఉండవచ్చునని ఇంటి యజమాని చెప్పాడు.అయితే స్థానికుకు మాత్రం ఆ పాములు ఎప్పుడు బయటకి వచ్చి ఎవరిని కాటు వేస్తాయో అని బెదిరిపోతున్నారు.