రష్మిక మందన్న ఇంటిపై ఐటీ రైడ్స్ జరిగిన విషయం తెల్సిందే.మొదట ఆమె తండ్రి ఆస్తులపై ఐటీ రైడ్స్ అనుకున్నారు.
కాని తీగ లాగితే డొంక అంతా కదిలినట్లుగా రష్మిక తండ్రి ఆస్తులకు సంబంధించిన పత్రాలు పరిశీలిస్తుంటే అందులో రష్మికకు సంబంధించిన ఆస్తుల వివరాలు కూడా వెళ్లడయి అయ్యాయి.రష్మిక పేరిట దాదాపుగా వంద కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా ఐటీ అధికారులు గుర్తించారట.
ఇప్పటి వరకు రష్మిక కనీసం పాతిక కోట్ల ఆస్తులకు కూడా పన్ను చెల్లించలేదు.
ఆదాయం కూడా ఆమె పాతిక కోట్లు కూడా లేనట్లుగా చూపించింది.అందుకే ఆమెపై ఆదాయానికి మించిన ఆస్తి కేసును నమోదు చేయడం జరిగింది.ఐటీ రైడ్స్ జరుగుతున్న సమయంలో రష్మిక ఒక సినిమా షూటింగ్ నిమిత్తం చెన్నైలో ఉంది.
షూటింగ్ నుండి హుటాహుటిన బెంగళూరు చేరుకుంది.బెంగళూరులోని ఐటీ అధికారుల సమక్షంలో నేడు రష్మిక హాజరు అవ్వబోతుంది.
తన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ను మరియు లెక్కలను చూపించబోతుంది.
ముఖ్యంగా రష్మిక ఆస్తుల్లో 50 ఎకరాల కాఫీ తోట చర్చనీయాంశం అవుతుంది.దాదాపుగా 50 కోట్లకు పైగా విలువ ఉండే ఆ కాఫీ తోట ఎలా కొనుగోలు చేశారు అనే విషయమై ఆమెను ఐటీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది.దానికి ఆమె సమాధానం చెప్తే పర్వాలేదు లేదంటే రష్మికపై కేసు నమోదు అయ్యే అవకాశం ఉంది.
రష్మిక జైలుకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.