మన సౌత్ సినిమాలు అంటే బాలీవుడ్ ప్రేక్షకులు కానీ హీరోలు కానీ ఇంతకు ముందు తక్కువ చేసి చూసే వారు.కానీ ఇప్పుడు అలా కాదు.
మన రేంజ్ మారిపోయింది.ఇంతకు ముందులా మన సినిమాలను చిన్న సినిమాలుగా కూడా చూడడం లేదు.
బాహుబలి తో మొదలైన మన సినీ ప్రయాణం అంచలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు బాలీవుడ్ నే శాసించే స్థాయికి వచ్చింది.
కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ఇండియన్ మార్కెట్ మీద మన సౌత్ సినిమాల ప్రభావం ఎక్కువుగా ఉంది అనే చెప్పాలి.పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను పలకరించాయి.అలాగే ఆ సినిమాలు సూపర్ హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ కూడా అందుకున్నాయి.
ఇప్పుడు ఉత్తరాది ప్రేక్షకులంతా సౌత్ సినిమాల మాయలో పడిపోయారు. పుష్ప నుండి మొదలైన సౌత్ మ్యానియా ఇప్పటికి తగ్గడం లేదు సరికదా రోజు రోజుకూ పెరుగుతుంది.
అదే సమయంలో బాలీవుడ్ సినిమాలు ఏవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.రిలీజ్ అయినా అన్ని సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకుంటున్నాయి.ఇలా వరుస ప్లాపులతో అప్పుడే 2022 సగం అయిపొయింది.ఇక సెకండాఫ్ లో అయినా బాలీవుడ్ హీరోలు అక్కడి ప్రేక్షకులను మాత్రమే కాదు పాన్ ఇండియా వ్యాప్తంగా ఆకట్టు కుంటారో లేదో వేచి చూడాలి.
మరి ఇప్పుడు పాన్ ఇండియా ను గురి చూసి కొట్టడానికి హీరోలు రెడీ అయ్యారు.
నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు బాలీవుడ్ నుండి రిలీజ్ కూడా రెడీ అవుతున్నాయి.ఇందులో రెండు రణబీర్ కపూర్ నటించిన సినిమాలే ఉన్నాయి.బ్రహ్మాస్త్ర, షంషేరా రెండు కూడా విడుదలకు రెడీగా ఉన్నారు.
షంషేరా జులై 22న రిలీజ్ కాబోతుంది.ఇక బ్రహ్మాస్త్ర మాత్రం సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది.
అలాగే అక్షయ్ కుమార్ రక్షా బంధన్ ఆగష్టు 11న రిలీజ్ అవుతుండగా.అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, అజయ్ దేవగన్ థాంక్స్ గాడ్ సినిమాలు కూడా విడుదలకు రెడీగా ఉన్నాయి.
మరి ఈ సినిమాలతో అయినా సౌత్ డామినేషన్ ను తగ్గించు కుంటుందో లేదో చూడాలి.