శ్రీకాకుళంలో ఘోరం... ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

ఈ మధ్య కాలంలో ఏపీలో తరుచుగా జరుగుతున్నా రోడ్డు ప్రమాదాలు ప్రజలని భయపెడుతున్నాయి.ఈ ప్రమాదాలలో మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.

 5 Family People Died In Road Accident In Srikakulam District-TeluguStop.com

తాజాగా కడప జిల్లా కదిరికి చెందిన స్కూల్ బస్సు విహార యాత్రలో భాగంగా కర్ణాటకలో ఉడిపి వద్ద రోడ్డు ప్రమాదంకి గురైంది.ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్ధులు మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తుంది.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ స్పందించి వివరాలు తెలుసుకొని సహాయక చర్యలు చేయాలని ఆదేశించారు.

ఈ ఘటన తో పాటు శ్రీకాకుళం జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

మందస మండలం కొత్తపల్లి బ్రిడ్జి వద్ద కారు అదుపు తప్పి పంటకాలువలోకి దూసుకెళ్లింది.ఈ ఘటనలో ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.నలుగురు మృతదేహాల్ని వెలికితీశారు.మరో ఇద్దరి కోసం కాలువలో గాలిస్తున్నారు.

డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు.దీంతో అతడ్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

బాధిత కుటుంబం సింహాచలం నుంచి ఒడిశాలోని బరంపురుంకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేస్తున్నారు.

దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇక చనిపోయిన బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube