చైనాలో అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ప్రభావంతో వచ్చిన కోవిడ్-19 వ్యాధి కారణంగా ఇప్పటికే ఆ దేశంలో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.ఇక అక్కడి నుంచి ఆసియా దేశాలు మొత్తం ఈ వైరస్ విస్తరిస్తుంది.
ఇప్పటికే హాంకాంగ్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, ఇరాన్, ఇరాక్ దేశాలకి విస్తరించిన కరోనా వైరస్ ఇప్పుడు ఇండియాలోకి ఎంటర్ అయిపొయింది.ఇక వైరస్ ఇండియాలోకి రావడానికి చిన్న నిర్లక్ష్యం చాలు.
ఆ నిర్లక్ష్యం వలన ఇప్పుడు ఇండియాలోకి చైనా నుంచి వచ్చిన విదేశీయుల కారణంగా, అలాగే అక్కడికి వెళ్లి వచ్చిన ఇండియన్స్ ని సరైన వ్యాధి పరీక్షలు విమానాశ్రయంలో చేయకుండా ఇండియాలో రానివ్వడంతో ఇప్పుడు వారి ద్వారా కరోనా వైరస్ దేశంలోకి వచ్చేసింది.
ఇప్పటి వరకు ఇండియాలో ఐదు కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర హోం శాఖ అధికారికంగా ప్రకటించింది.
దీంతో దేశ వ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల దగ్గర అప్రమత్తం అయినట్లు తెలిపారు.అలాగే మరిన్ని కేసు విస్తరించకుండా వారిని హాస్పిటల్ లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు తెలిపారు.
ప్రజలు వీలైనంత జాగ్రత్తగా ఉండాలని దగ్గు, చాతినోప్పు వంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తే తక్షణం పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది.ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా నమోదైన ఐదు కేసులలో మూడు కేసులు తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విశాఖ, తిరుపతిలో నమోదైనట్లు తెలుస్తుంది.
మరి ఈ కరోనా మరింత వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది వేచి చూడాలి.