టీచర్ అంటే పాఠాలు చెప్పాలి.ప్రపంచంతో ఎలా వ్యవహరించాలో పిల్లలకి నేర్పాలి.
అందులోనూ పదహారేళ్ళు కూడా దాటని వారంటే, లోకజ్ఞానం లేనివారు.అలాంటివారిని సరైన దారిలో పెట్టడం టీచర్ల బాధ్యత.కాని ఒక 40 ఏళ్ళ టీచర్ మాత్రం ఓ అబ్బాయికి మాయమాటలు చెప్పింది.15 ఏళ్ళ కుర్రాడికి ప్రేమపాఠాలు నేర్పింది.అసలే టీనేజ్, ఓ మహిళ వెంటపడుతోంటే, ఆకర్షితుడవకుండా ఉంటాడా? ఇంకేం, ఇద్దరు ప్రేమించుకున్నారట.
అది గుజరాత్ లోని అహ్మదాబాద్.
ఆ కుర్రాడి తల్లిదండ్రులు, ట్యూషన్ చెబుతున్న టీచర్, ఇద్దరూ ఒకే అపార్ట్మెంట్లో ఉంటున్నారు.టెన్త్ పరీక్షల కోసం ఆవిడ దగ్గరకి ట్యూషన్ కి వెళితే, ఆవిడేమో ప్రేమిస్తున్నాను నిన్ను అంటూ ప్రేమలో పడేసింది.
అంతటితో ఆగకుండా, లేచిపోదాం, కలిసి బ్రతుకుదాం అంటూ లేని అలోచనలు పుట్టించింది.
మొత్తానికి ఇద్దరు ఇంట్లోంచి పారిపోయారు.
అబ్బాయి స్నేహితుల్లో ఒకరు వీరిద్దరికి సాయం చేసాడు.మూడు రాష్ట్రాలు తిరిగిన ఆ జంట, మధ్యమధ్యలో హోటల్స్ లో బస చేస్తూ శారీరకంగా కూడా దగ్గరయ్యారట.
ఇంత జరిగాక, పోలిసుల చేతికి చిక్కారు.టీచర్ ని అరెస్టు చేసి జైల్లో వేసారు.
బాలుడి తల్లిందండ్రుల స్టెట్మెంట్ రికార్డు చేసి, అతన్ని ఇంటికి పంపించేసారు.