జంతువులు ఎన్నో వింతలు, విన్యాసాలు చేసినప్పటికీ ఒకప్పుడు ఎవరికి తెలిసేది కాదు.కానీ ఇప్పుడు ఏ జంతువు ఎక్కడ ఏం చేసిన ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అలా వైరల్ అవ్వడానికి కారణం మనిషె.ఏదైనా చిన్న వింత కనిపించిన వెంటనే తన దగ్గర ఉన్న కెమెరా తీసి వీడియో తీసేస్తున్నారు.
అందుకే వైరల్ అవుతున్నాయి.
ఇక ఇప్పుడు కూడా అలానే ఓ వ్యక్తి ఓ వీడియో తీశాడు.
ఆ వీడియో చూస్తే ఎవరైనా సరే వావ్ అని ఆశ్చర్యపోతారు.అలా ఆశ్చర్యపోవడమే కాదు షాక్ కూడా అవుతారు.
అంతగా ఏంటి అనుకుంటున్నారా.అదేనండి ఓ 40 అడుగుల తిమింగలం ఓ మనిషి చేతిలో రెక్క వేసి హైఫైవ్ చెప్పింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.హవాయిలోని లాహినా హార్బర్లో కొందరు వ్యక్తులు బోటులో వెళ్లారు.అలా కొద్దీ దూరం వెళ్ళగానే ఓ తిమింగలం కనిపించింది.వారు వస్తుండటంతో అది అక్కడే ఆగిపోయింది.
అక్కడికి బోటు చేరుకోగానే ఓ వ్యక్తి దానికి హాయ్ చెప్పగా అది తన రెక్కను పైకి లేపి వ్యక్తికి హైఫైవ్ చెప్పింది.ఇది అంత వీడియో తీసి ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం అది వైరల్ గా మారింది.