ఏదైనా మన కష్టం మనకు మిగులుతుంది.ఎవరో సంపాదించిన దానికోసం మనం ఆరాటపడితే మనకు ఏం వస్తుంది.
అదృష్టం అనేది ఉండాలి.కొందరు ఏమి చెయ్యకపోయినా వారికి అదృష్టం కలిసొస్తుంది.
ఇంకా అలానే ఒక కుటుంబం గుప్తా నిధుల కోసం వెళ్లాలనుకున్నారు.నురగలు కక్కుకొని మృతి చెందారు.
ఇంకా ఈ ఘటన వనపర్తి జిల్లా రేపల్లి మండలం నాగాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన హజీరాబేగం, రహీం దంపతులకు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.అయితే రహీమ్ కొన్నేళ్ల క్రితం అకస్మాత్తుగా మృతి చెందాడు.అప్పటికే ముగ్గురు కూతుళ్ల పెళ్లిళ్లు జరిగాయి.
ఇద్దరు కూతుళ్లు నాగర్కర్నూలులో, చిన్నకూతురు హైదరాబాద్లో నివసిస్తున్నారు.కొడుకు కరీంపాష తండ్రి వృత్తితో కాలం గడుపుతున్నాడు.ఆరేళ్ళ క్రితం వారి ఇంట్లో గుప్త నిధులు ఉన్నటు దేవుడు కలలోకి వచ్చి చెప్పినట్టు హాజిరాబేగం చెప్పింది.అయితే తవ్వకాలు చేపట్టవద్దని బంధువులు, కుటుంబసభ్యులు చెప్పడంతో ఆమె ఆలోచన చెయ్యలేదు.
రెండో కూతురు ఆస్మ, అల్లుడు ఖాజాపాషా మాత్రం నిధులు దొరికితే పేదరికం పోయి ఆనందంగా బతకచ్చని ఆశపడి గుప్త నిధి తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు.అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
అన్ని పూర్తి చేసుకున్న వారు నోట్ల నురగతో విగత జీవిగా పడి ఉన్నారు.యూసఫ్ అనే బంధువు ఇంటికి వెళ్లగా అక్కడ నలుగురు మృతి చెంది కనిపించరు.
దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.అయితే మృతుల వద్ద కొబ్బరికాయ, నిమ్మకాయ, పసుపు, కుంకుమ ఉండడంతో క్షుద్ర పూజలు జరిగినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.