నెదర్లాండ్స్ దేశానికి చెందిన ఫిలిప్స్ కంపెనీ ఇండియాలో తాజాగా ఎవ్నియా 34-అంగుళాల గేమింగ్ మానిటర్ పరిచయం చేసింది.ఈ ప్రీమియం మానిటర్లో టాప్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లను ఆఫర్ చేసింది.ఫిలిప్స్ ఎవ్నియా గేమింగ్ మానిటర్ WQHD రిజల్యూషన్, 165Hz రిఫ్రెష్ రేట్తో 34-అంగుళాల కర్వ్డ్ ఎల్సీడీ డిస్ప్లే, మినీ ఎల్ఈడీ బ్యాక్లైట్, 1.07 బిలియన్ రంగులు, డిస్ప్లే హెచ్డీఆర్ 1400 సర్టిఫికేషన్తో వస్తుంది.మరింత ఫ్లూయిడ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఇందులో లో-ఇన్పుట్ ల్యాగ్, 2.5ms రియాక్షన్ టైమ్ ఇచ్చారు.
పిక్చర్-ఇన్-పిక్చర్, పిక్చర్-బై-పిక్చర్ మోడ్స్, 2 ఇన్-బిల్ట్ స్పీకర్స్, 10W వరకు DTS-ట్యూన్డ్ సౌండ్ అవుట్పుట్, అడ్జస్టబుల్ స్టాండ్, ఆంబిగ్లో టెక్నాలజీ వంటి అధునాతన ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.కనెక్టివిటీ విషయానికొస్తే ఫిలిప్స్ ఎవ్నియా గేమింగ్ మానిటర్లో యూఎస్బీ 3.2 Gen 1, USB-B, నాలుగు USB-A, ఆడియో అవుట్, HDCP 1.4 (HDMI/ DisplayPort/ USB-C) పోర్ట్లను కంపెనీ అందించింది.ఎవ్నియా గేమింగ్ మానిటర్ ధర, లభ్యతను ఫిలిప్స్ ఇంకా వెల్లడించలేదు.త్వరలోనే ఆ వివరాలను తెలిపే అవకాశం ఉంది.అయితే టెక్ రిపోర్ట్స్ ప్రకారం దీని ప్రైస్ రూ.40 వేల నుంచి రూ.50 వేల మధ్యలో ఉండొచ్చని తెలుస్తోంది.
34 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్ లో గేమ్స్ ఆడుతుంటే రియల్ లైఫ్ లో గేమ్స్ ఆడినంత అనుభూతి లభిస్తుందని ఫిలిప్స్ కంపెనీ తెలుపుతోంది.అలాగే స్పీకర్స్ కూడా మంచి ఇమ్మర్సివ్ ఆడియో ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేస్తుందని వెల్లడించింది.గేమింగ్ ప్రియులు ఈ మానిటర్ ను ఒకసారి చెక్ చేయవచ్చు.