మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది.సోమవారం తెల్లవారుజామున 3.40 గంటలకు ఓ శిథిల భవనం కుప్ప కూలింది.ఈ భవనంలో సుమారు 150 మంది నివసిస్తున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.
మూడు రోజులుగా థానే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ బ్రిగేడ్, ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ ఆపరేషన్ టీంలు శ్రమిస్తున్నాయి.బుధవారం నాటికి 33 మృతదేహాలను కనుగొన్నట్లు అధికారులు వెల్లడించారు.
సుమారు 100 మందికి పైగా రెస్క్యూ టీం సభ్యులు సహాయక చర్యలు చేపడుతున్నారని అధికారులు పేర్కొన్నారు.
ముంబయి లోని థానేకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీవండి ప్రాంతంలో శిథిలావస్థకు చేరుకున్న భవనం ఉంది.
ఈ భవనాన్ని 43 ఏళ్ల క్రితం నిర్మించారు.ఇందులో 40 ఫ్లాట్లు ఉండగా.
సుమారు 150 మంది నివాసముంటున్నారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి శిథిలావస్థకు చేరిన ఇళ్లు పదునెక్కింది.
సోమవారం తెల్లవారుజామున నేలమట్టం అయింది.భవనంలో నివాముంటున్న వారందరూ అందులోనే ఇరుక్కున్నారు.
రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది.చిక్కుకున్న వారిని వెతికేందుకు క్యానిన్ స్క్వాడ్ ను వినియోగిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది.
ఈ మేరకు భవన యజమాని సయ్యద్ అహ్మద్ జిలానీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.జీహెచ్ఎంసీ అధికారులు భీవండి-నిజాంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ భవనం శిథిలావస్థకు చేరిన నిర్మాణాల జాబితాలో లేదని ఆరోపించారు.
శిథిలాలు తొలగించేందుకు ప్రయత్నాలు ముమ్మురంగా జరుగుతున్నాయని, శిథిలాల కింద మరికొంత మంది ఉండవచ్చని మున్సిపల్ అధికారులు తెలుపుతున్నారు.క్షతగాత్రులను అత్యవసర వైద్య సేవలు కల్పిస్తున్నామని అధికారులు తెలుపుతున్నారు.