ప్రస్తుత రోజుల్లో ఎవరు ఏ విషయాన్ని ఎంతలా ప్రేమిస్తున్నారో తెలియడం లేదు.కొంత మంది తాము పెంచుకునే జంతువుల మీద చూపించే ప్రేమను చూస్తుంటే ఆశ్చర్యం కలుగక మానదు.
అంతలా వాటి పట్ల తమ ప్రేమను వ్యక్తపరుస్తారు.ఎంత డబ్బైనా సరే వాటి ఆనందం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు.
ఒక వేళ అవి తప్పిపోతే తెగ బాధపడిపోతారు.అలా ఓ యజమాని పెంచుకునే పెంపుడు పిల్లి మిస్సయినందట.
అందుకు తన పిల్లిని పట్టుకొచ్చి అప్పగించిన వారికి ఏకంగా 30 వేల రూపాయలిస్తానంటూ ఒకావిడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం చూసి పలువురు షాక్ తింటున్నారు.అసలేం జరిగిందంటే….
హైదరాబాద్ నగరంలోని టోలిచౌకీ ప్రాంతానికి చెందిన జరీనా అనే మహిళ… తాను 8 నెలలుగా ప్రాణానికి ప్రాణంగా భావించి పెంచుకుంటున్న పిల్లి మిస్సయిందని బాధపడిపోతుంది.తన పెంపుడు పిల్లికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించడం కోసం జూబ్లీ హిల్స్ లో ఉన్న ఓ పెట్ క్లీనిక్ కు తీసుకెళ్లిందట.
వారు అక్కడ సర్జరీ చేయగా.తీసుకుని ఇంటికి వచ్చింది.కానీ ఆ సర్జరీ వల్ల పిల్లికి వాపు రావడంతో మరలా ఒకసారి పెట్ క్లీనిక్ కు తీసుకెళ్లాల్సి వచ్చింది.ఆ సమయంలోనే పిల్లి కానరాకుండా పోయింది.
ఈ ఘటనపై పోలీసులకు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదని జరీనా వాపోయింది.ఇక చివరి ప్రయత్నంగా తాను స్వయంగా జూబ్లీ హిల్స్ ప్రాంతంలో పిల్లి ఫొటోతో ఉన్న కరపత్రాలను కూడా పంపిణీ చేసింది.అయినా లాభం లేకపోవడంతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన పిల్లి తప్పిపోయిందని తీసుకొచ్చి అప్పగించిన వారికి అక్షరాలా 30 వేల రూపాయలను బహుమతిగా అందిస్తానంటూ ప్రకటించింది.ఇది విన్న పలువురు హవ్వా… పిల్లి కోసం 30 వేల రూపాయల రివార్డా అని ముక్కున వేలేసుకుంటున్నారు.