చైనాలో ప్రాణంపోసుకుని అనతికాలంలోనే ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకేసిన అతిసూక్ష్మజీవి కరోనా వైరస్.ఎప్పుడు నాశనం అవుతుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు.
ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని ఇప్పటికే ఎన్నో లక్షల మంది ప్రాణాలు విడిచారు.ఇక సామాన్యులతో పాటు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఇలా అందరూ కరోనా బారిపడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` చిత్రటీమ్లో కరోనా తీవ్ర విషాదం నింపింది.ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన నరేష్ కరోనా బారినపడి మృతి చెందారు.
గత రెండు వారాల క్రితం ఆయనకు కరోనా సోకగా.హాస్పటల్లో అడ్మిట్ అయ్యారు.
అయితే అక్కడ ఆయన పరిస్థితి విషమించి గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. బుల్లితెర యాంకర్ ప్రదీప్ డెబ్యూ మూవీ `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` రిలీజ్ కోసం నరేష్ వెయిట్ చేస్తుండగా.
ఇలా జరగడం చిత్రటీమ్లో విషాదాన్ని నింపింది.కాగా, ప్రదీప్ మాచిరాజు హీరోగా, అమృతా అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి మున్నా దర్శకత్వం వహించాడు.
ఇప్పటికే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉన్నా.కరోనా కారణంగా వాయిదా పడింది.