తెలుగు బుల్లితెరపై ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందిన మేల్ యాంకర్ గా ప్రదీప్ మాచిరాజు పేరు తెచ్చుకున్నాడు.అయితే గత సంవత్సరంలో ప్రదీప్ మాచిరాజు బుల్లితెరపై నుండి వెండి తెరపై హీరోగా కన్పించడానికి సిద్ధమై సినిమాను కూడా పూర్తి చేశాడు.అయితే సినిమా రిలీజ్ చేసే సమయానికి కరోనా వైరస్ వల్ల ఏర్పడిన లాక్ డౌన్ కారణంగా సినిమా రిలీజ్ కాలేకపోయింది.“30 రోజుల్లో ప్రేమించడం ఎలా” అనే సినిమా టైటిల్ తో యాంకర్ ప్రదీప్ హీరోగా పరిచయం కాబోతున్నాడు.ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటించింది.
హీరో ప్రభాస్ కు చెందిన యూవీ క్రియేషన్స్, అలాగే అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ సంస్థలు ఈ సినిమాను 2020 సంవత్సరం లోనే ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని భావించిన కానీ.
కరోనా వల్ల ఈ చిత్రం రిలీజ్ కావడం వాయిదా పడింది.అయితే సోషల్ మీడియా కారణంగా ఈ సినిమా లోని “నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్న” అనే పాట సూపర్ హిట్ అయ్యింది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైన ఈ పాట ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది.
ఇక అసలు విషయంలోకి వెళితే.తాజాగా “30 రోజుల్లో ప్రేమించడం ఎలా.?” సినిమా చిత్ర బృందం ప్రదీప్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ తెలిపింది.సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన ఈ విషయాన్ని తెలిపింది.అదేంటంటే.సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది.ఈ సినిమాను జనవరి 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లోకి రాబోతున్నట్లు చిత్రబృందం తెలియజేసింది.
నీలి నీలి ఆకాశం ఇద్దమనుకున్న అనే పాట ఎంత సూపర్ హిట్ అయిందో అదే రేంజ్ లో ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంటుంది అంటూ సినిమా నిర్మాతలు తెలుపుతున్నారు.