కరోనా వైరస్.చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచ దేశాలను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే.దీంతో ప్రపంచ దేశాలు లాక్ డౌన్ అమలు చేశాయి.ఇంకా మన దేశంలో కూడా గత 40 రోజులుగా లాక్ డౌన్ అమలవుతుంది.మే 17వ తేదీ వరుకు లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ లాక్ డౌన్ పొడిగింపు వల్ల ఎంతోమంది ఆర్ధికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
అయితే లాక్ డౌన్ అనేది అందరికి ఒకేలా ఉండదు అని అందరికి తెలిసిందే.దీంతో పుదుచ్చేరి రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలోని పసుపు రంగు రేషన్ కార్డుదారులకు 30 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఆ రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.దీంతో రేషన్ షాపుల్లో బియ్యం పంపిణి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
అటు సహకార శాఖ సిబ్బందికి పెండింగ్ లో ఉన్న మూడు నెలల జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం నిధులు విదుదల చేసింది.