ఏఎస్ఐ కు కరోనా పాజిటివ్,30 మంది పోలీసుల సెల్ఫ్ క్వారంటైన్

కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్న విషయం తెలిసిందే.ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 1 లక్ష 20 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 19 లక్షల మందికి పైగా కరోనా బారిన పడిన వారిలో ఉన్నారు.

 Delhi Police Dcp, 30 Cops Self-quarantine,asi ,aiims, Tests Positive For Covid-1-TeluguStop.com

భారత్ లో కూడా ఈ కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చడం తో లాక్ డౌన్ ను కూడా విధించింది.ఈ వైరస్ కు ఎలాంటి మందు లేకపోవడం తో సోషల్ డిస్టెన్సింగ్ అనేది పాటించాలి అని లేదంటే ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దీనితో ఎవరికైనా కరోనా పాజిటివ్ అని తేలగానే వారి కుటుంబీకులను కూడా క్వారంటైన్ కేంద్రాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ క్రమంలో తాజాగా ఒక ఏఎస్ఐ కు కరోనా పాజిటివ్ రావడం తో దాదాపు 30 మంది పోలీసులను సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీ లో చోటుచేసుకుంది.ఢిల్లీలో ఓ ఏఎస్ఐకు కరోనా సోకడంతో ఓ డీసీపీతోపాటు 30 మంది పోలీసులను సెల్ఫ్ క్వారంటైన్‌లోకి పంపినట్లు సమాచారం.

ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తున్నప్పటికీ పోలీసులు,వైద్యులు సఫాయి కార్మికులు మాత్రం తమ విధులను నిర్వర్తిస్తూనే ఉన్నారు.

Telugu Cops Quarantine, Aiims, Corona Effect, Delhi Dcp, Covid-

అయితే డిపార్ట్మెంట్ లో ఒకరికి పాజిటివ్ రావడం తో వారితో సంబంధము ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లాల్సి వస్తుంది.ఇటీవల ముంబై కి చెందిన మంత్రి గారు కూడా సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిన విషయం తెలిసిందే.ఆయన కలిసిన ఒక పోలీసు అధికారికి కరోనా పాజిటివ్ రావడం తో మంత్రిగారు ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube