బోరుబావిలో పడిన మూడేళ్ళ బాలుడు మృతి... నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలి

బోరు బావిలో పడి చిన్నారి మృతి… ఇప్పటి వరకు ఈ మాట చాలా సార్లు వినిపించి ఉంటుంది.తరుచుగా దక్షిణాది రాష్ట్రాలలో ఇలాంటి ఘోరాలు గ్రామీణ ప్రాంతాలలో జరుగుతూ ఉంటాయి.

 3 Year Old Boy Sai Vardhan Died, Telangana, Medak, Lock Down, Bore Well-TeluguStop.com

సంఘటన జరిగాక వీటి గురించి ఆలోచించే ప్రభుత్వాలు, సంఘటన జరగకుండా ఆపడానికి మాత్రం పెద్దగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించవు.బోరు బావి తవ్వే సమయంలో గాని, దాని తీసేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో కాని ఎలాంటి సూచనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా బోర్లు తవ్వేసి వదిలేయడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఇలాంటి ఘటనలు తరుచుగా చూడాల్సి వస్తుంది.

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లిలో నిన్న సాయంత్రం మూడేళ్ళ బాలుడు బోరుబావిలో పడిపోయాడు.అతనిని రక్షించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.దీంతో ఆ మూడేళ్ల బాలుడు సాయివర్ధన్ మృతి చెందాడు.ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 12 గంటలపాటు శ్రమించినా ఫలితం లేకుండాపోయింది.

బావికి సమాంతరంగా పొక్లెయిన్లతో గొయ్యి తవ్వి బాలుడిని వెలికి తీశారు.అయితే, అప్పటికే బాలుడు మృతి చెందాడు.

అనంతరం సాయివర్ధన్ మృతదేహాన్ని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.బాలుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

గ్రామంలో విషాదం నెలకొంది.పంటపొలంలో బోరుబావి వేసిన అరంగంటకే సాయివర్ధన్ అందులో పడిపోయాడు.

పొలం వద్ద బాలుడుని పట్టించుకోకుండా ఎవరి పనుల్లోకి వారు వెళ్ళిపోవడంతో ఈ ఘటన జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube