ఎన్నికల ముందు ఏపీ రాజకీయాలలో ప్రధాన పార్టీలు ప్రచార హోరులో దూసుకుపోతున్నారు.మరో వైపు తమ రాజకీయ వ్యూహాలని అమలు చేసుకుంటూ ముందుకి వెళ్తున్నారు.
అయితే ఈ ఎన్నికలలో ఏపీలో ఎన్నడూ లేని విధంగా టీడీపీకి వరుసగా దెబ్బలు తగులుతున్నాయి.తెలుగు దేశం పార్టీ నుంచి ఈ మధ్య వైసీపీలో చేరిపోతున్న నాయకుల సంఖ్య ఎక్కువగా ఉంది.
వైసీపీకి ఏపీలో విజయం వస్తుంది అనే సంకేతాల నేపధ్యంలో ఎన్నికల ముందుగానే చాలా మంది నేతలు వైసీపీ కుంపటి పెట్టేస్తున్నారు.
తాజాగా ఈ ఒక్క రోజే టీడీపీకి చెందిన కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసారు.
వీరిలో ఒకరు గతంలో వైసీపీ తరుపున గెలిచి తరువాత టీడీపీ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే గాంధీ కాగా.మరొకరు మాజీ మంత్రి వైఎస్ సన్నిహితుడు సాయిప్రతాప్ కూడా టీడీపీకి రాజీనామా చేసారు.
ఆయన త్వరలో వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.మరో వైపు శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేయడంతో పాటు టీడీపీని మూడు నియోజకవర్గాలలో ఓడించేందుకు పని చేస్తా అని చెప్పుకొచ్చారు.
ఇలా ఉన్నపళంగా ఈ ఒక్కరోజులో ముగ్గురు పెద్ద నాయకులు టీడీపీకి షాక్ ఇవ్వడం ఇప్పుడు రాజకీయాలో సంచలనంగా మారింది