మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును మెగా ఫ్యాన్స్ ఏ రేంజ్లో సెలబ్రెట్ చేసుకుంటారో అందరికీ తెలిసిందే.అయితే ఈసారి కరోనా ప్రభావంతో మెగాస్టార్ వేడకులను ఘనంగా నిర్వహించడం కుదరడం లేదు.
కానీ మెగాస్టార్ పుట్టినరోజును మాత్రం వారు చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు.చిరంజీవి బర్త్డే గిఫ్ట్గా కామన్ మోషన్ పోస్టర్(CMP)ని ఏకంగా భారత్లోని అన్ని ఇండస్ట్రీలకు చెందిన 65 టాప్ సెలబ్రిటీల చేతుల మీదుగా లాంఛ్ చేయించేందుకు మెగా ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.
ఇప్పటికే ఆయా టాప్ సెలబ్రిటీలతో వారు సంప్రదింపులు కూడా జరుపుటున్నారని తెలుస్తోంది.అయితే ఆ 65 మంది టాప్ స్టార్స్ ఎవరనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు.
కానీ వారిలో ఓ ముగ్గురు పేర్లు మాత్రం బయటకు వినిపిస్తున్నాయి.అందరితోనూ మంచి రిలేషన్ పెట్టుకునే చిరు కోసం టాలీవుడ్ నుండి విక్టరీ వెంకటేష్, మలయాళం నుండి మమ్ముట్టి, బాలీవుడ్ నుండి సునీల్ శెట్టి ఈ కామన్ మోషన్ పోస్టర్ను లాంఛ్ చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.
ఇంకా ఇతర ఇండస్ట్రీల నుండి పలువురు టాప్ స్టార్స్ చిరు బర్త్డే గిఫ్టుగా ఈ మోషన్ పోస్టర్ను లాంఛ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.అటు సినిమాల పరంగాను చిరు బర్త్డే కానుకగా అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు దర్శకులు రెడీ అవుతున్నారు.
ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ను రిలీజ్ చేసేందుకు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్లా్న్ చేస్తున్నాడు.దీంతో పాటు చిరు తన నెక్ట్స్ ప్రాజెక్టును కూడా తన పుట్టినరోజు కానుకగా అనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
మొత్తానికి చిరు బర్త్డే నాడు మెగా ఫ్యాన్స్కు అదిరిపోయే ట్రీట్ ఉండనుంది.