టాలీవుడ్ బ్యూటీ సమంత అక్కినేని పరిచయం గురించి ఎంత చెప్పినా తక్కువే.టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ నాగచైతన్య ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వరుస సినిమాలలో అవకాశాలు అందుకని బాగా బిజీగా మారింది.
అంతేకాకుండా బిజినెస్ పరంగా కూడా సమంత బాగా యాక్టివ్ గా ఉంటుంది.సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ ముందే ఉంటుంది.
వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా ఎన్నో వాణిజ్యపరమైన ప్రకటనలను చేసింది.ఇక నిత్యం ట్రెండ్ ని ఫాలో అవుతుంది ఈ ముద్దుగుమ్మ.ఒక నటన విషయంలోనే కాకుండా వ్యాపారంలో, సోషల్ సర్వీస్ లలో ఇలా పలు రకాలుగా ముందుంటుంది సమంత.ఇక టాలీవుడ్ లో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకుంది ఈ బ్యూటీ.
ఇదిలా ఉంటే తనలో మూడు మార్పులు వచ్చాయని ఓ గుట్టు బయట పెట్టింది సమంత.
తన పదకొండేళ్ల ప్రయాణంలో మూడు ప్రధానమైన మార్పులు కలిగాయని తెలిపింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.తను చాలా చాలా హార్డ్ వర్క్ చేసే వ్యక్తినని తెలిపింది.
అంతేకాక భద్రత లేని భావంతో ఉండేదట.అనేక స్వీయ అనుమానాలతో కూడా ఉండేదట.
కానీ ఇన్నేళ్లు గడిచిన తర్వాత తనలోని అభద్రత భావం ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందట.
దానివల్ల పెద్ద పెద్ద రిస్క్ లు తీసుకోవడం కూడా నేర్చుకుందట సమంత.ఇప్పుడు తనలో ఆత్మవిశ్వాసం ఉందని తెలిపింది.అంతే కాకుండా భయం, అభద్రతను వదిలిపెట్టి పెద్ద రిస్క్ లైన తీసుకుంటుందట.
అలా తీసుకోవడం వల్లే తనలో ఆ మూడు మార్పులు వచ్చాయని తెలిపింది సమంత.ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికొస్తే ఇటీవలే రాజ్ డీకే దర్శకత్వంలో విడుదలైన ది ఫ్యామిలీ మాన్ 2 లో కీలక పాత్రలో నటించగా మంచి సక్సెస్ ను అందుకుంది.
ఇక ఇదే కాకుండా శాకుంతలం సినిమాలో శకుంతల పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉంది.
ఇక ఈ బ్యూటీకి బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి.