ప్రపంచం లొనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం ఇండోనేషియా.అయితే ఇక్కడ ఇటివలే ఎన్నికలు జరిగాయి.ఆ దేశ అధ్యక్ష పదవికి సంబందించిన జాతీయ మరియు ప్రాంతీయ పార్లమెంట్ స్థానాలకు ఈ నెల 17 వ తేదీన ఎన్నికలు నిర్వహించారు.26 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం లో ఓటర్లు కూడా ఎక్కువే.
దాదాపు 19 కోట్ల ఓటర్లు ఉన్న ఇండోనేషియా దేశం లో అక్కడి ఎన్నికల కమిషన్ ఒకే విడత లో పోలింగ్ నిర్వహించారు.అక్కడి ప్రజలు కూడా తమకి ఇష్టమైన నాయకుడిని గెలిపించుకోవాలని ఓట్లు వేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించారు , మొత్తం మీద ఇక్కడ 80 శాతం ఓట్లర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
ఓట్లు లెక్కించే సమయం లో వింత రోగం తో సిబ్బంది మృతి
మన దేశం లో లాగా అక్కడ ఎన్నికల కోసం ఈవిఎం లను వాడలేదు.ఇండోనేషియా లో ఎప్పుడు బ్యాలెట్ విధానం లొనే ఎన్నికలు నిర్వహిస్తారు.
ఒక్కో ఓటరు ఐదు బ్యాలెట్ పేపర్లలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.మే 22న ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో అక్కడి ఎన్నికల సిబ్బంది రేయింబవళ్లు కోట్లాది బ్యాలెట్ పేపర్లను చేతులతో కౌంటింగ్ చేయాల్సి ఉంది , దీంతో అలసటకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ వందలాది సిబ్బంది ప్రాణాలను కోల్పోతున్నారు.
జనరల్ ఎలక్షన్ కమిషన్(కేపీయూ) తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు మొత్తంగా 272 మంది ఎన్నికల సిబ్బంది చనిపోగా, 1,878 మంది ఆసుపత్రి పాలయ్యారు.వీరందరికి ఉచితంగా వైద్య సేవలు అందించాలి అక్కడి ప్రభుత్వం ఆర్డర్లు వేసింది.
అంతేకాకుండా చనిపోయిన సిబ్బంది కుంటుంబాలకు నష్ట పరిహారంగా డబ్బును చెల్లించే యోచనలో ఆ దేశ ఆర్థిక శాఖ ఉంది.ఇదిలా ఉండగా ఎన్నికల కమిషన్ తగిన సిబ్బందిని ఏర్పాటు చేసుకోలేకపోవడం కారణంగానే ఇంతమంది చనిపోయారని ప్రతిపక్ష పార్టీకి చెందిన అహ్మద్ ముజానీ ఆరోపించారు.