మహారాష్ట్ర లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.ఒక బ్యాంకు పై కప్పు కుప్పకూలిపోవడంతో పలువురు తీవ్రంగా గాయపడగా మరికొందరు శిధిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తుంది.
మహారాష్ట్ర షోలాపూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.బుధవారం ఉదయం ఉన్నపాటున షోలాపూర్ లోని ఒక బ్యాంకు పై కప్పు కూలిపోయింది.
దీనితో ఈ శిధిలాల కింద సుమారు 25 మంది చిక్కుకున్నారు.ఈ క్రమంలో వెంటనే సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో శిధిలాల కింద చిక్కుకున్న వారిలో 10 మందిని సురక్షితంగా రక్షించగలిగారు.అయితే శిధిలాల కింద మరికొందరు చిక్కుకున్నారని వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నట్లు సహాయక సిబ్బంది తెలిపారు.
ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.మరోపక్క ఈ వార్త పలువురికి పాకడం తో ఘటనా స్థలికి పెద్ద ఎత్తున జనం అక్కడకి చేరుకొని సహాయక చర్యలను వీక్షిస్తున్నారు.
ప్రస్తుతం ఇంకా ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతున్నారు అధికారులు.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.అలానే ఎలా బ్యాంకు పై కప్పు కూలిపోయింది అన్నదానిపై కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది.