మహారాష్ట్రలో ఘోర ప్రమాదం,శిధిలాల కింద 25 మంది

మహారాష్ట్ర లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.ఒక బ్యాంకు పై కప్పు కుప్పకూలిపోవడంతో పలువురు తీవ్రంగా గాయపడగా మరికొందరు శిధిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తుంది.

 25feared Trappedas Roofof Buildinginmaharashtras Solapurcollapses-TeluguStop.com

మహారాష్ట్ర షోలాపూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.బుధవారం ఉదయం ఉన్నపాటున షోలాపూర్ లోని ఒక బ్యాంకు పై కప్పు కూలిపోయింది.

దీనితో ఈ శిధిలాల కింద సుమారు 25 మంది చిక్కుకున్నారు.ఈ క్రమంలో వెంటనే సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో శిధిలాల కింద చిక్కుకున్న వారిలో 10 మందిని సురక్షితంగా రక్షించగలిగారు.అయితే శిధిలాల కింద మరికొందరు చిక్కుకున్నారని వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నట్లు సహాయక సిబ్బంది తెలిపారు.

ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.మరోపక్క ఈ వార్త పలువురికి పాకడం తో ఘటనా స్థలికి పెద్ద ఎత్తున జనం అక్కడకి చేరుకొని సహాయక చర్యలను వీక్షిస్తున్నారు.

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం,శిధ

ప్రస్తుతం ఇంకా ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతున్నారు అధికారులు.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.అలానే ఎలా బ్యాంకు పై కప్పు కూలిపోయింది అన్నదానిపై కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube