యంగ్ హీరో నిఖిల్ పెళ్లి చేసుకొని తాజాగా కొత్తజీవితంలోకి అడుగుపెట్టాడు.ఇక కెరియర్ విభిన్న కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని నిఖిల్ సొంతం చేసుకొని దూసుకుపోతున్నాడు.
నిఖిల్ సినిమా అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ప్రేక్షకులు అనుకునే రేంజ్ లో ఇమేజ్ పెంచుకున్నాడు.ఇప్పుడు నిఖిల్ తన కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన కార్తికేయ సినిమాకి సీక్వెల్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.
చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమా కూడా మొదటి సినిమా రేంజ్ లోనే ఉండబోతుంది.ఇక ఈ సినిమా మరింత హై ఒల్టేజ్ లో మైథాలజీకి లింక్ ఉన్న కథతో తెరకెక్కుతుంది.
ఈ నేపధ్యంలో ఈ సినిమా కోసం నిఖిల్ కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ కేటాయిస్తున్నారు.ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా కాన్సెప్ట్ వీడియో ఆకట్టుకోవడంతో పాటు సినిమా ఏ అంశం పై ఉంటుందనే విషయాన్ని క్లారిటీగా చూపించడంతో సినిమా మీద కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఈ నేపధ్యంలో నిర్మాతలు నిఖిల్ మార్కెట్ కి మించి బడ్జెట్ కేటాయించడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది.ఏకంగా 25 కోట్ల బడ్జెట్ తో సినిమాని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.
సినిమాలోని కొన్ని కీలకమైన యాక్షన్ సీక్వెన్స్, విఎఫ్ఎక్స్ వర్క్ కోసం ఇంత భారీగా బడ్జెట్ పెడుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.అయితే బడ్జెట్ ఆ స్థాయిలో ఉన్న కూడా కార్తికేయ సీక్వెల్ మీద ఉన్న అంచనాలతో షూటింగ్ మొదలుకావడానికి ముందే డిజిటల్, శాటిలైట్ రూపంలో భారీ డిమాండ్ ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తుంది.