ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆడపిల్లలకు, మహిళలకు రక్షణ లేకుండా పోతుంది.ఏదో ఒక రకంగా వాళ్లని హింసించే మృగాలు రోజు రోజుకు ఎక్కువై పోతున్నారు.
ఎన్ని శిక్షలు విధించినా పట్టించుకోకుండా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు.ఇటీవలే తల్లి వరుసయ్యే చవితి తల్లిపై అఘాయిత్యం గా పాల్పడిన ఘటన చోటు చేసుకుంది.
భోపాల్ కు చెందిన మహిళ(24).ఆమెకు ఇద్దరు పిల్లలు.కొంతకాలం క్రితమే ఆమె భర్త మరణించాడు.అతనికి ఇదివరకే ఒక యువతితో పెళ్లి కాగా వాళ్లకు ఒక కొడుకు ఉన్నాడు… ఆమె మరణించడంతో… మరో యువతిని వివాహం చేసుకున్నాడు.
దీంతో మొదటి భార్య కొడుకు రెండవ భార్య పై కన్ను వేశాడు.ఎవరి లేని సమయాన తన సవతి తల్లి పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో సవతి తల్లి తన పిల్లలు వేరే వేరే గదిలో పడుకున్న విషయాన్ని గమనించి… ఆమె గదిలోకి దూరాడు.దీంతో ఆమె కేకలు వేయకుండా తన నోట్లో గుడ్డలు పెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు.
తల్లి వరుసయ్యే సవితి అమ్మ ని పట్టించుకోకుండా ఇంతటి దుర్మార్గానికి పాల్పడ్డాడు ఈ నీచుడు.అంతేకాకుండా ఈ విషయం గురించి బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి అక్కడి నుండి పారిపోయాడు.
దీంతో ఈ సంఘటన విషయాన్ని తన బంధువులకు చెప్పుకో గా… వాళ్ళు ఆ బాధితురాలిని ఈ విషయం గురించి బయటికి చెప్పకూడదని… చెబితే తమ పరువు పోతుందని అడ్డు పడ్డారు.వాళ్ల మాటలు పట్టించుకోకుండా ఆ బాధితురాలు ఆ దుండగుని నుండి తన రక్షణ కై పోలీసులకు ఈ విషయాన్ని తెలిపింది.
కాగా పోలీసులు కేసును నమోదు చేసుకొని దుండగుడిని పట్టుకోవడానికి గాలింపు చేస్తున్నారు.