తెలంగాణ లో మొత్తం 119 మంది ఎమ్యెల్యేలు ఉండగా మొన్న జరిగిన ఎన్నికల్లో కొత్తగా అసెంబ్లీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా 24 మంది ఎమ్యెల్యేలు ఉన్నారు.మొన్న జరిగిన ఎన్నికల్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మహేంద్ర రెడ్డి, జూపల్లి కృష్ణారావు వీరంతా.
కొత్తగా ఎన్నికైనవారి చేతిలోనే ఓడిపోయారు.అలాగే బిజెపి నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు కూడా కొత్త వారి చేతిలోనే ఓటమి చెందారు.
తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇరవై నాలుగు మంది అయితే వారిలో ఇద్దరు ఎమ్.పిలు కాగా, ఒక మాజీ ఎమ్.పి కూడా ఉన్నారు.
బాల్కా సుమన్ ,సి.హెచ్ మల్లారెడ్డి లు ఎమ్.పిలు కాగా, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మాజీ ఎమ్.పి ,ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.వీరు ముగ్గురు అసెంబ్లీకి మొదటి సారి ఎన్నికయ్యారు.
కొత్తగా ఎన్నికైన ఇరవై నాలుగు మందిలో పదిహేను మంది టిఆర్ఎస్ నుంచి ఆరుగురు కాంగ్రెస్ నుంచి టిడిపి, పార్ వర్డ్ బ్లాక్ నుంచి ఒక్కొక్కరు, ఒక ఇండిపెండెంట్ మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.