ఏ తల్లి కూడా తన కన్న పాపను తన చేతులతో చంపేయాలనుకోదు.ఎంత అందవిహీనంగా ఉన్నా, ఎంత పెద్ద లోపం ఉన్నా కూడా కడుపులో పెట్టుకుని దాచుకుంటుంది.
కాని మద్యప్రదేశ్లోని ఒక తల్లి మాత్రం తనకు పుట్టిన కూతురుకు చిన్న లోపం ఉందని ఏకంగా బిడ్డనే చంపుకుంది.ఆమె బిడ్డను చంపేసే ఉద్దేశ్యం లేకుండా చేసిన పనికి కూతురు చనిపోయి పుట్టెడు దుఖ:ను మిగుల్చుకుంది.ఆమెపై కోపంతో జనాలు జాలిని కూడా చూపుతున్నారు.
పూర్తి వివరాల్లోకివెళ్తే… మద్యప్రదేశ్లోని ఖండ్వా జిల్లాకు చెందిన ఒక మహిళ ఇటీవలే తల్లి అయ్యింది.ఆమెకు జన్మించిన పాపకు చేతులకు మరియు కాళ్లకు ఆరు వేళ్లు ఉన్నాయి.అంటే 20 వేళ్లకు బదులుగా 24 వేళ్లు ఉన్నాయి.
అలా ఎక్కువ వేళ్లు ఉంటే అశుభం అంటూ అక్కడి వారి నమ్మకం.ఆ మూడ నమ్మకంతో ఆమె అత్యంత దయనీయమైన పని చేసింది.
తన కూతురుకు ఉన్న ఆ అదనపు వేళ్ల వల్ల అంతా కూడా ఆమెను దురదృష్ట వంతురాలు అంటారని, దాంతో పాటు పెదయ్యాక పెళ్లి కూడా కాకపోవచ్చు అని అదనంగా ఉన్న వేళ్లను కొడవలితో కోసేసింది.
వేళ్లను కోసి వేయడంతో తీవ్ర రక్త స్రావం అయ్యింది.గాయాల వద్ద ఆవు పేడ పెట్టి కూతురుకు కట్టు కట్టే ప్రయత్నం చేసింది.కాని కూతురు నొప్పి బరించలేక మరియు తీవ్ర రక్తస్రావం అయ్యి కొద్ది సేపటికి మరణించింది.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.సొంత కూతురును మూడ నమ్మకం పేరుతో చంపేసుకున్న ఆ మహిళపై పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వౌరీ మొదలు పెట్టారు.
ఇలా పిల్లలకు చిన్న లోపం ఉందని ఏ తల్లి కూడా ఇలాంటి పిచ్చి పనులు చేయవద్దు.వారికి మంచి చేస్తున్నామని భావించి ఇలాంటి దారుణాలు చేయడం వల్ల వారి జీవితాలే లేకుండా పోయే ప్రమాదం ఉంది.అందుకే కాస్త జాగ్రత్తగా ఉండండి అమ్మలు.!
.