భూమి మీద ఎన్నో నేరాలు జరుగుతున్న కూడా వాటికి సరైన శిక్షలు ఇప్పటికి కూడా అమలు చేయకపోగా.ఆ మోసగాళ్లను, నేరగాళ్లను అలాగే వదిలేస్తుంటే.
కేవలం రెండే రెండు చొక్కాలు దొంగతనం చేసినందుకు ఏకంగా 23 ఏళ్ల జైలు శిక్ష ఇచ్చారట.దొంగతనం చేసినందుకు జరిమానా లేదా కొన్ని రోజుల పాటు జైలు శిక్ష ఇస్తారు కానీ 23 ఏళ్ల అంటే మామూలు విషయం కాదు.
ఇంతకీ శిక్ష వేసింది ఎక్కడో కాదు.అమెరికా దేశంలో.
అసలు నమ్మడం లేదు కదా.అమెరికాలోని ఈ శిక్ష విధించారు.
ఇంతకీ ఈ శిక్ష ఎప్పుడో వందల ఏళ్ల క్రితం అయితే కాదు.ఇప్పుడే 2000 సంవత్సరంలో వేసిన శిక్ష ఇది.గయ్ రాంగ్ అనే 40 ఏళ్ల నల్లజాతి వ్యక్తి.ఆయన గతంలో రెండు చొక్కాలు దొంగతనం చేశాడు.ఇంతకీ ఆ చొక్కాల ధర మన కరెన్సీ ప్రకారమైతే రూ.37 వేలు.ఇక అతన్ని అరెస్టు చేసి ఏకంగా కోర్టు ఎదుట నిలబెట్టారు.అప్పటికే అతనిపై 36 నేరాలు చేసినట్లు గుర్తించారు.
ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని 23 ఏళ్ల జైలు శిక్ష విధించారు.ఇంత తీవ్రమైన శిక్ష ఇవ్వడానికి కారణం లూసియానాలోని జరుగుతున్న వివాదాస్పదాల వల్ల అనిపిస్తుంది.
అంతేకాకుండా అతను నల్లజాతి వ్యక్తి కావడంతో కూడా ఇంత కఠినంగా శిక్ష విధించారని వినిపిస్తుంది.
ఇక ఇటీవలే అతని ఉదంతం గురించి తెలిసిన ఇన్నో సెన్స్ ప్రాజెక్ట్ న్యూ ఓర్లీన్స్ అనే ఎన్జీవో.అతడు శిక్ష గురించి మళ్లీ తెలుసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి చేశారు.దీంతో ఆయన 23 ఏళ్ల శిక్ష కాస్త 20 ఏళ్ల గా మార్చి విడుదల చేశారు.
ఇక ఆయన జైలు నుంచి విడుదల బాగా అతని కుటుంబసభ్యులు ఎవరూ రాలేదు.ఎందుకంటే అప్పటికే తన కుటుంబ సభ్యులు మరణించారని తెలియగా ఒంటరిగా ఉన్న అతడిని ఆదుకునేందుకు అక్కడున్నవారంతా విరాళాలు సేకరిస్తున్నారు.