ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ కి చాలావరకు టీకాలు వచ్చిన సంగతి తెలిసిందే.మన దేశంలో కూడా ఈ రోజు నుండే గా పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయింది.
ఇదిలా ఉంటే మన కంటే ముందే నార్వే దేశం లో వచ్చిన వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం జరిగింది.ఈ క్రమంలో నార్వే దేశంలో వ్యాక్సిన్ వేసుకుని 23 మంది వృద్ధులు.
అది వికటించి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో మృతి చెందారు.
ఈ పరిణామంతో వెంటనే అప్రమత్తమైన నార్వే ప్రభుత్వం… దేశంలో బాగా బలహీనమైన వారు ముసలి వారు ఎక్కువగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండటమే బెటర్ అని పేర్కొంది.ఫైజర్ కంపెనీ కి చెందిన వ్యాక్సిన్ కావటంతో… ఆ కంపెనీ ప్రతినిధులు 23 మంది మరణించిన ఘటనపై విచారణ చేపట్టడానికి రెడీ అయింది.ఈ పరిణామంతో నార్వే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలలో ఆందోళన స్టార్ట్ అయింది.
తాజా వార్తలు