అమెరికాలో అతిపెద్ద తెలుగు సంఘమైన తానా తన 22వ వార్షికోత్సవ వేడుకలని ఎంతో వైభవంగా జరుపుకుంటున్న విషయం విధితమే.ఈ వేడుకలకి అతిరధ మహారధులు అందరూ హాజరవుతున్నారు.
మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలకోసం వాషింగ్టన్ డీసీ లో కళ్ళు చెదిరేలా ఏర్పాట్లు చేస్తున్నారు తానా సభ్యులు.ఈ వేడుకలోనే ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ , స్పోర్ట్స్ కాంపిటేషన్స్, ఇలా రకరకాల కార్యక్రమాలతో తానా నిండుగా ముస్తాబయ్యింది.
ఈ వేడుకలకి పవన్ కళ్యాణ్ , సంగీత దర్శకులు, గాయకులు, రాజకీయ నేతలు, పలువురు హాజరయ్యారు.మొదటి రోజు కార్యక్రమాలు దిగ్విజయంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఇదిలాఉంటే రెండో రోజు తానా మహాసభల్లో ప్రత్యేకతలు ఏమిటంటే.
తానా పరేడ్ నిర్వహణ , ఎ మ్యుజికల్ జర్నీ విత్ ఎం.ఎం.కీరవాణి, సినీ గాయని సునీత తో లైవ్ పెర్ఫార్మెన్స్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇరువురు కీలక ఉపన్యాసాలు చేయనున్నారు.“ఎక్స్లెన్స్ ఇన్ లీడర్షిప్” అనే విషయంపై భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రసంగం చేయనున్నారు.మూడో రోజు శ్రీనివాస కళ్యాణంతో తానా మహాసభలు ముగుస్తాయి.
తాజా వార్తలు