అగ్ర రాజ్యం అమెరికా తనకి ఎదురు చెప్పిన ఏ దేశాన్ని అయినా గుప్పెట్లో తీసుకునే క్రమంలో వణికిస్తుంది.కానీ వణికించేది మాత్రం అక్కడ ఎప్పుడు వస్తుందో తెలియని టోర్నడోలు.
ఎప్పుడు వస్తాయో తెలియదు, వచ్చే ముందు మాత్రం భీభత్సం చేస్తూ , అమెరికా ప్రజలపై విరుచుకు పడుతాయి.ఈ క్రమంలో ఎంతో మంది ప్రజలు ఆర్ధికంగా నష్టపోతారు , ఒక్కో సారి ప్రాణ నష్టం కూడా జరుగుతూ ఉంటుంది.అయితే సుమారు నెల రోజుల క్రితం ఇదే ప్రాంతంలో టోర్నడోలు విరుచుకుపడి తీవ్ర నష్టం వాటిల్లడమే కాకుండా ఇళ్ళకి ఇళ్ళు గాలిలో పైకి లేచి ముక్కలు ముక్కలు అయ్యాయి.ఒక ఇంటిలో ఉన్న వృద్ద దంపతులు టోర్నడోలో చిక్కుకుని మరణించారు కూడా.
ఈ ఘటన మరువకుండానే.తాజాగా అమెరికాలోని నాష్ విల్లే లో టోర్నడోలు విజ్రుంభించాయి. నిన్నటి రోజున ఉదయం మొదలైన టోర్నడోల భీభత్సం గంటల పాటు కొనసాగుతూనే ఉంది.ఈ ఘటన కారణంగా సుమారు 22 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది.ఎంతో మంది ప్రజలు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.సుమారు 40 భవనాలు నేలమట్టం అయ్యాయి.
ఈ నష్టాన్ని అంచనా వేసేందుకు హెలికాప్టర్ ద్వారా సర్వే లు చేపట్టారు అధికారులు.స్థానికంగా ఉన్న స్కూళ్ళు, కోర్టులు, విమానాశ్రాయాలు మూసివేశారు.