జీవితంలో ప్రతి ఒక్కరు ఆనందంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటారు.దాని కోసం ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటారు.
అసలు జీవితం అంటేనే కష్టాలు, సుఖాలు,ఒడిదుడుకులతో నిండి ఉంటుంది.మనం డబ్బుతో జీవితాన్ని ఆనందంగా గడిపినప్పుడు చుట్టాలు,స్నేహితులు అందరూ మన చుట్టూనే ఉంటారు.
అదే కష్టాలు
ఎదురు అయినప్పుడు మన చుట్టూ ఎవరు ఉండరు.అలాంటి సమయంలోనే మనకి ఆప్తులు
ఎవరో అనేది అర్ధం అవుతుంది.
అయితే బియ్యంతో ఇలా చేస్తే మంచి జరుగుతుంది.అక్షింతలకు మన పూజలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.అక్షింతలు అంటే అఖండమైనది, శుభకార్యాలలో ఏది వెలిగేది ఉపయోగించకుడదు.అందుకే మునులు అందరు కలిసి బియ్యాన్ని అంటే అక్షింతల ను ఎన్నుకున్నారు.
దేవునికి అక్షింతలు ఎంత ఇష్టం అంటే నాలుగు
గింజలకే ప్రసన్నమైపోతారట.
ఒక మంచి సుముహుర్తాన ఒక ఎర్ర రంగు వస్త్రం లో ఇరవై ఒక్క బియ్యం గింజలు
తీసుకొని వాటికి పసుపు కలిపి ఆ బియ్యాన్ని ఆ వస్త్రం లో కట్టి దానిని
లక్ష్మి దేవి ముందు ఉంచి, ఆ తర్వాత భక్తిశ్రద్ధలతో పూజ చేసి మీ బీరువాలో
పెడితే అనుకున్న పనులు జరగటమే కాకుండా అనుకున్నంత ధన లాభం కూడా
కలుగుతుంది.
అలాగే సోమవారం శివుని దగ్గర ఒక కేజీ బియ్యాన్ని పెట్టి పూజ చేసి ఆ బియ్యంలో గుప్పెడు తీసుకోని శివునికి అభిషేకం చేసి, మిగిలిన బియ్యాన్ని పేదలకు దానం చేస్తే కూడా కష్టాలు తొలగిపోతాయి.