మెగాస్టార్ చిరంజీవి తన సినిమాల వేగాన్ని పెంచారు.ఇప్పటికే ఆచార్య రిలీజ్ కి రెడీ అవగా మోహన్ కృష్ణ డైరక్షన్ లో గాడ్ ఫాదర్, కె.
ఎస్ రవీంద్ర డైరక్షన్ లో సినిమా.మెహెర్ రమేష్ డైరక్షన్ లో భోళా శంకర్ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.
ఆచార్య 2022 ఫిబ్రవరి 4న రిలీజ్ ఫిక్స్ చేసుకోగా గాడ్ ఫాదర్ కూడా జూన్, జూలైలో వస్తుందని అంటున్నారు.కె.ఎస్ రవీంద్ర సినిమా, భోళా శంకర్ సినిమాలు కూడా 2022 లోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.అంటే వచ్చే ఏడాది నాలుగు మెగాస్టార్ చిరంజీవి సినిమాల రిలీజ్ లు ఉంటాయని అంటున్నారు.
నాలుగు కాకపోయినా మ్యాక్సిమం రెండు లేదా మూడు సినిమాలు అయితే మెగా ఫ్యాన్స్ ను అలరించడానికి వస్తాయని తెలుస్తుంది.చిరు సినిమా అంటే మెగా ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు.
మరి ఈ మెగా హంగామా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.తప్పకుండా మెగాస్టార్ తన ఫ్యాన్స్ అందరిని మెప్పించేలా ప్రయత్నిస్తాడని తెలుస్తుంది.
ఆచార్యలో చిరుతో పాటుగా చరణ్ కూడా నటిస్తున్నాడు.మరోపక్క చరణ్ ఆర్.ఆర్.ఆర్ సినిమా కూడా వస్తుంది. చిరు, చరణ్ ఇద్దరు కలిసి 2022 మెగా ఫ్యాన్స్ కు మరచిపోలేని ట్రీట్ ఇచ్చేలా ఉన్నారు.