ఈ మధ్య కాలంలో మన హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడమే గొప్ప విషయం మారిపోయింది.ఇక కొంత మంది హీరోలు అయితే రెండు సంవత్సరాలకు ఒకసారి కూడా తెరమీద కనిపించడం లేదు.
ఇలా ఎంతో గ్యాప్ ఇచ్చి సినిమాలు చేస్తున్న హీరోలు ఏడాదికి రెండు సినిమాలు చేస్తే మా హీరో గొప్ప అంటూ ఫ్యాన్స్ తెగ సంతోష పడుతూ ఉన్నారు.
అలాంటిది మెగాస్టార్ చిరంజీవి ఏకంగా ఆరేడు సినిమాలతో రాబోతున్నాడు.ఏడు సినిమాల కంటే ఒకటి ఎక్కువనే వస్తుంది కానీ తక్కువ కాదు.2022-23 ఏడాదిలో ఈ ఏడూ సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు మెగాస్టార్.ఆచార్య మొదలు కొని మారుతీ, వెంకీ కుడుముల సినిమాల వరకు చిరు చేయబోతున్న సినిమాలన్నీ ఈ ఏడాది ఇంకా వచ్చే ఏడాది రాబోతున్నాయి.
కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఆచార్య సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇక ఇప్పటికే గాడ్ ఫాదర్, భోళా శంకర్ తో పాటు వాల్తేరు వీర్రాజు సినిమాలను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు.ప్రెసెంట్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాల్లో ఒకటి లేదా రెండు సినిమాలు ఇదే ఏడాదిలో విడుదల అవ్వబోతున్నాయి.
ఏ సినిమా షూటింగ్ కు అయినా మూడు నాలుగు నెలలకు మించి సమయం కేటాయించాలని చిరు అనుకోవడం లేదు.అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సినిమా షూటింగులు పూర్తి చేసి విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు.గాడ్ ఫాదర్ ఇప్పటికే ముగింపు దశకు చేరుకోవడంతో ఆచార్య తర్వాత ఈ సినిమానే విడుదల అయ్యేందుకు అవకాశం ఉంది.
ఆ తర్వాత బోలా శంకర్ రిలీజ్ అవ్వబోతుంది.ఇదే సమయంలో మారుతి, వెంకీ కుడుముల, అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా చిరంజీవి సినిమాలు చేయనున్నాడు.ఇలా మొత్తంగా రాబోయే రెండేళ్లలో చిరు నుండి దాదాపు 7 సినిమాలు రాబోతున్నాయి.
దీంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.చిరు నుండి మాత్రమే కాదు మెగా హీరోల నుండి కూడా ఈ రెండేళ్లలో వరుస సినిమాలు రాబోతున్నాయి.
అందుకే మెగా అభిమానులకు ఈ రెండేళ్లు పండగే అని చెప్పాలి.