టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది డైరెక్టర్లకు ఈ ఏడాది తెరకెక్కించిన సినిమాలతో సక్సెస్ దక్కింది.గతంలో ఫ్లాపులతో కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్న డైరెక్టర్లు ఈ ఏడాది సక్సెస్ సాధించడంతో సినిమా ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నారు.
ఈ ఏడాది సక్సెస్ ను సొంతం చేసుకున్న డైరెక్టర్లలో గోపీచంద్ మలినేని ఒకరు.క్రాక్ సినిమాతో ఈ ఏడాది గోపీచంద్ మలినేని విజయాన్ని అందుకున్నారు.
కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న శ్రీకాంత్ అడ్డాల నారప్ప సినిమాతో సక్సెస్ సాధించారు.ఈ సినిమాకు ముందు శ్రీకాంత్ అడ్డాల సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
నారప్ప ఓటీటీలో స్ట్రీమింగ్ అయినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడం గమనార్హం.మరో డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ బొమ్మరిల్లు సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించారు.
ఆరెంజ్, ఒంగోలు గిత్త సినిమాల ఫ్లాప్ లతో నిరాశ చెందిన బొమ్మరిల్లు భాస్కర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో సక్సెస్ ను అందుకున్నారు.
అఖండ సినిమాతో బోయపాటి శ్రీను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ల జాబితాలో చేరారు.
అఖండ సక్సెస్ తరువాత బోయపాటి శ్రీనుకు క్రేజ్ పెరిగింది.బోయపాటి శ్రీను కెరీర్ బెస్ట్ హిట్లలో అఖండ మూవీ హిట్ గా నిలిచింది.
తాజాగా విడుదలైన అఖండ రెండు రోజుల్లోనే 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించిందని వార్తలు వస్తున్నాయి.మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కెరీర్ లో ఈ సినిమాతో మరో సక్సెస్ ఖాతాలో చేరింది.
గతంలో పరాజయాలతో కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్న డైరెక్టర్లు సక్సెస్ ట్రాక్ లోకి రావడంతో ఆయా డైరెక్టర్ల అభిమానులు కూడా సంతోషిస్తున్నారు.ఈ డైరెక్టర్ల తర్వాత సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాల్సి ఉంది.