టాలీవుడ్ టాప్ హీరోల నుంచి యువ హీరోల వరకు ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఎంతో సందడి చేసేవారు.ప్రతి సంక్రాంతి పండుగకు పోటాపోటీగా ప్రముఖ హీరోలందరూ సంక్రాంతి బరిలోకి దిగి నువ్వా, నేనా అన్నట్టు పోటీ ఉండేది.
అయితే ఈ సంవత్సరం అలాంటి పండుగ వాతావరణం థియేటర్ల ముందు కనిపించలేదు.అభిమానుల అరుపులు అసలే వినిపించలేదు.
వీటన్నింటికీ కారణం ఒక కరోనా మహమ్మారి అని చెప్పవచ్చు.ఈ మహమ్మారి వల్ల చిత్ర నిర్మాణ పనులు ఆగిపోయి ఈ సంవత్సరం ఒక హీరో సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలలో ప్రేక్షకులను అలరించే ఈ స్టార్ హీరోల సినిమాలు ఒక్కటి కూడా రాలేదు.ఆ స్టార్ హీరోల గురించి ఇక్కడ తెలుసుకుందాం….
మెగాస్టార్ చిరంజీవి: జస్ట్ టైమ్ గ్యాపంతే.టైమింగ్లో గ్యాప్ ఉండదు అని డైలాగులు చెప్పిన మెగాస్టార్ చిరంజీవికి సైతం టైమ్ గ్యాప్ తప్పలేదు.ఒకప్పుడు సంవత్సరానికి ఐదారు సినిమాలలో నటిస్తున్న మెగాస్టార్, కొంతకాలం రాజకీయాల్లోకి ప్రవేశించి సినిమాలకు విరామం ఇచ్చారు.చాలాకాలం విరామం తర్వాత 2019లో సైరా సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరించారు.
ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేవని చెప్పవచ్చు.
నందమూరి బాలకృష్ణ:
ప్రతి ఏడాది నందమూరి బాలకృష్ణ సంక్రాంతి బరిలో కచ్చితంగా ఉంటారు.బాలయ్య సినిమా లేని సంవత్సరం అంటే ప్రేక్షకులకు ఏదో వెలితిగానే ఉంటుంది.బాలకృష్ణ సినీ ప్రస్థానం లో ఐదు సంవత్సరాలు సంక్రాంతి బరిలో సినిమాలు లేకుండా ఉన్నాయి.
ప్రస్తుతం ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శీను దర్శకత్వంలో బీబీ3 అనే పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది.ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో సింహ, లెజెండ్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.
కరోనా లేకపోతే ఈ సంక్రాంతి బరిలో బాలయ్య, బోయపాటి సినిమా ఉండేదని చెప్పవచ్చు.
నాగార్జున అక్కినేని: ప్రతి సంవత్సరం ఏదో ఒక సినిమా ద్వారా నాగార్జున ప్రేక్షకుల ముందు ఉంటారు.అలాంటిది కరోనా కారణం వల్ల ఈ ఏడాది నాగార్జున కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు.ప్రస్తుతం నాగార్జున “బ్రహ్మాస్త్ర“అనే బాలీవుడ్ సినిమాలో నటించారు.
డిసెంబర్ 4న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది.అంతే కాకుండా నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ‘వైల్డ్ డాగ్’ తాజాగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
అయితే ఈ సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు.నాగార్జున సినీ ప్రస్థానంలో రెండు సంవత్సరాలు ఒక సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు ప్రస్తుతం 2020 సంవత్సరంలో కూడా కరోనా వల్ల సినిమా కూడా విడుదల కాలేదు.
విక్టరీ వెంకటేష్: విక్టరీ వెంకటేష్ కుటుంబ కథా చిత్రాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.ఈ మధ్య కాలంలో వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఎఫ్2, వెంకీమామలాంటి మల్టీ స్టారర్ చిత్రాలు విజయవంతం కావడంతో, తాజాగా “నారప్ప” అనే చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కించారు.కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా మే 1న విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.అయితే కరోనా వల్ల సాధ్యం కాలేకపోయింది.1986 సంవత్సరంలో వెండితెరకు పరిచయమైన వెంకటేష్ తన సినీ ప్రస్థానంలో 2011,2018,2020 సంవత్సరాలలో మాత్రమే ఒక్క సినిమా కూడా రాలేదని చెప్పవచ్చు.ఎంతటి స్టార్ హీరోలు సినిమాలు ఈ ఏడాది ఒక్కటి కూడా విడుదల కాలేదంటే దానికి కారణం కేవలం కరోనా అని చెప్పవచ్చు.