తెలుగు సినిమా పరిశ్రమలో సంక్రాంతికి పలు చిత్రాలు విడుదలవుతాయి.ప్రతి ఏడాది మాదిరిగానే 2019 సంక్రాంతికి పలు సినిమాలు విడుదలకు సిద్దం అయ్యారు.
ఆరు నెలల ముందుగానే కొన్ని సినిమాలు సంక్రాంతి బెర్త్ ను ఖరారు చేసుకున్న విషయం తెల్సిందే.సంక్రాంతికి చరణ్ మూవీ ‘వినయ విధేయ రామ’తో పాటు వరుణ్, వెంకీల మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’, బాలకృష్ణ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రాలు రాబోతున్నాయి.
ఈ మూడు సినిమాలు కూడా కాస్త గ్యాప్ తో సంక్రాంతి బరిలో ఉండబోతున్నాయి.ఇక్కడి వరకు పర్వాలేదు.
ఇప్పుడే అసలు సమస్య మొదలైంది.
సంక్రాంతికే రజినీకాంత్ నటించిన ‘పేట్ట’ చిత్రం విడుదల కాబోతున్నట్లుగా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ప్రకటించిన విషయం తెల్సిందే.పేట చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది.దాంతో సినిమా విడుదల గురించి అనేక రకాుగా ప్రచారం జరిగింది.
మొదట డిసెంబర్లో సినిమాను విడుదల చేయాలని భావించారు.కాని కొన్ని కారణాల వల్ల సినిమాను జనవరిలో పొంగల్ కు విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు చెప్పాడు.
ఈ నేపథ్యంలో తమిళనాట సంక్రాంతికి విడుదల కాబోతున్న చిత్రాలతో పాటు తెలుగు సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్నవి ఇబ్బందులు పడుతున్నాయి.
రజినీకాంత్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్ ఉంది.2.ఓ చిత్రం దాదాపుగా 70 కోట్లకు తెలుగులో అమ్ముడు పోయింది అంటే రజినీకాంత్ స్థాయి ఏంటో చెప్పుకోవచ్చు.అందుకే పేట్ట చిత్రం కూడా తప్పకుండా భారీగా తెలుగులో క్రేజ్ తో విడుదలయ్యే అవకాశం ఉంది.అందుకే తెలుగు హీరోలు రజినీని చూసి టెన్షన్ పడుతున్నట్లుగా తెలుస్తోంది.
పేట్ట చిత్రం విడుదల తేదీ వచ్చిన తర్వాత గందరగోళ పరిస్థితి నెలకొంది.మరి ఈ పరిస్థితి నుండి టాలీవుడ్ సినిమాలు ఎలా బయట పడి, సంక్రాంతి బరిలో నిలుస్తాయనేది చూడాలి.