2019లో మైల‌వ‌రంలో మొగాడు ఎవ‌రు?

కృష్ణా జిల్లాలోని మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంపై ఇప్పుడు అంద‌రి దృష్టీ ప‌డుతోంది.ఇక్క‌డి నుంచి ఇప్ప‌టికే రెండు సార్లు గెలిచిన మంత్రి దేవినేని ఉమా, వైసీపీ త‌ర‌ఫున కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న జోగి ర‌మేష్‌ల‌లో ఎవ‌రికి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డ‌తార నే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

 2019 Mylavaram Constituency Devineni Jogi Ramesh-TeluguStop.com

నిజానికి ఇక్క‌డ క్లాస్ మాస్ రెండూ ఉన్నాయి.వీటికి తోడు కార్మిక కుటుంబాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

ఇక‌, సామాజిక వ‌ర్గాల వారీగా చూస్తే క‌మ్మ‌, రెడ్లు, కాపుల‌తో పాటు బీసీ, ఎస్సీ ఓట‌ర్లు ఉన్నారు.నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త కొన్నేళ్లుగా క‌మ్మ వ‌ర్గానికి చెందిన వాళ్లే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వ‌స్తున్నారు.

ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లం విజ‌య‌వాడ‌కు ఆనుకుని ఉండ‌డంతో ఇక్క‌డ సిటీ ప్ర‌భావం ఉంది.ఇక జి.కొండూరు, మైల‌వ‌రం, రెడ్డిగూడెం మండ‌లాలు వ్య‌వ‌సాయానికి ప్ర‌ధానంగా అనుకూలంగా ఉంటాయి.

నియోజ‌క‌వ‌ర్గంలో ద‌శాబ్ద‌కాలంగా మంత్రి దేవినేని ఉమా ప్ర‌భావ‌మే ఇక్క‌డ కొన‌సాగుతోంది.జోగి ర‌మేష్ ప్రాబ‌ల్యం అంతంత మాత్ర‌మే.అయితే, గ‌డిచిన నాలుగు ఏళ్ల‌లో దేవినేని ఈ నియోజ‌క‌వ‌ర్గానికి చేసింది ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్న వారూ ఇక్క‌డ ఉండ‌డం గ‌మ‌నార్హం.2009, 2014లో ఇక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ల్లో దేవినేని ఉమా రెండు సార్లూ విజ‌యం సాధించారు.అయితే, ఈ రెండు ద‌ఫాల్లోనూ 2014లో గెలిచిన త‌ర్వాత .దేవినేని నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని స్థానికులు విమ‌ర్శిస్తున్నారు.అదేస‌మ యంలో పోల‌వ‌రం, ప‌ట్టిసీమ ప్రాజెక్టుల‌తోనే దేవినేని టైం గ‌డిచిపోయింది.

దీంతో స్థానికంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను పరిష్కరించ‌డంలో దేవినేని విఫ‌ల‌మ‌య్యార‌నే వాయిస్ వినిపిస్తోంది. ఏదో అడ‌పా ద‌డ‌పావ‌చ్చి పార్టీ కార్య‌క్ర‌మాలు, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రు కావ‌డం మిన‌హా ఇక్క‌డ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని అంటున్నారు.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో 2019 ఎన్నిక‌ల్లో దేవినేనిఇక్క‌డ గ‌డ్డు కాలం త‌ప్పేలా లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.నిజానికితాను చేప‌ట్టిన ప్రాజెక్టుల ప‌నులు చేయ‌డం మంచిదేన‌ని, అయితే, నియోజ‌క‌వ‌ర్గాన్ని కూడా ప‌ట్టించుకోవాల‌నే విమ‌ర్శ‌లువ‌స్తున్నాయి.

గ‌త ఏడాదికాలంగా నియోజ‌క‌వ‌ర్గాన్ని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశార‌ని చెబుతున్నారు.

ముఖ్యంగా రాష్ట్ర స‌మస్యల ప‌రిష్కారంవిష‌యంలోనూ దేవినేని ఆశించ‌న మేర‌కు పురోగ‌తి సాధించ‌లేక పోయారు.

ఒక్క ప‌ట్టిసీమ విష‌యం లోనే ఆయ‌న అనుకున్న స‌మ‌యానికి పూర్తి చేయ‌గ‌లిగినా.పోల‌వ‌రం విష‌యంలో ఆయ‌నకు ఎలాంటి అధికారం లేకుండా పోయింది.

ఈ ప్రాజెక్ట‌ను చంద్ర‌బాబు త‌న క‌న్నుస‌న్న‌ల్లోనే ఉంచుకున్నారు.తాను చెప్పిన‌ట్టే ప్రాజెక్టు నిర్మాణం జ‌రిగేలా చూసుకున్నారు.

దీంతో దేవినేని ప్రభ అంత‌కంత‌కూ త‌గ్గిపోయింది.

ఇక‌, ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిన జోగి ర‌మేష్ బాబుకు కూడా పెద్ద‌గా సానుకూల ప‌వ‌నాలు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అయితే, తాజాగా జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌చారం, పాద‌యాత్ర జోగికి బాగా క‌లిసి వ‌స్తాయ‌ని అంటున్నారు వైసీపీ నేత‌లు.వ‌చ్చే ఎన్నిక‌ల్లో దేవినేనిపై ఉన్న యాంటీ ఓటు జోగికి అనుకూలంగా మార‌డం ఖాయ‌మ‌ని చెబుత‌న్నారు.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో జోగికి ఇక్క‌డ సానుకూల ప‌వ‌నాలు వీచే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube