సాధారణంగా నూతన సంవత్సరం అంటే జనవరి 1 అని భావిస్తాం.కానీ మన తెలుగు సంవత్సరాది ప్రకారం కొత్త సంవత్సరం అంటే ఉగాది.
ఆ రోజు ఉగాది పచ్చడి చేసుకోవటం,పంచాంగ శ్రవణం చేయటం చాలా ముఖ్యం.ఆ రోజు చేసే ఉగాది పచ్చడిలో అన్ని రుచులు వేస్తారు.
ఎందుకంటే సంవత్సరం అంతా వారి జీవితంలో ఆ రుచులు కలగలిపి ఉండాలని కోరుకుంటారు.
కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుందంటే ఆ సంవత్సరం ఎలా ఉంటుందో అని అందరిలోనూ ఆసక్తిగా ఉండటం సహజమే.
ఉగాది నుండి ఏ రాశి వారు ఏమి చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా మంగళవారం నాడు ఎరుపు రంగు బట్టలను ధరించి ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాలి.
వృషభ రాశి ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా శుక్రవారం నాడు తెల్లని బట్టలను ధరించి అమ్మవారి గుడికి వెళ్ళాలి.
మిధున రాశి ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా బుధవారం నాడు ఆకుపచ్చని బట్టలను ధరించి రామాలయానికి వెళ్ళాలి.
కర్కాటక రాశి ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా సోమవారం నాడు తెల్లని బట్టలను వేసుకొని శివాలయానికి వెళ్ళాలి.
సింహ రాశి ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా ఆదివారం నాడు ఎరుపు రంగు బట్టలను వేసుకొని సూర్య భగవానుణ్ణి ఆరాధించాలి.
కన్య రాశి ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా బుధవారం నాడు ఆకుపచ్చని బట్టలను ధరించి రామాలయానికి వెళ్ళాలి.
తులా రాశి ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా శుక్రవారం నాడు తెల్లని బట్టలను ధరించి అమ్మవారి గుడికి వెళ్ళాలి.
వృశ్చిక రాశి ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా మంగళవారం నాడు ఎరుపు రంగు బట్టలను ధరించి ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాలి.
ధనస్సు రాశి ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా గురువారం నాడు పసుపు రంగు బట్టలను ధరించి గుడికి వెళ్ళాలి.
మకర రాశి ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా శనివారం నాడు నలుపు లేదా నీలం రంగు బట్టలను ధరించి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి.
కుంభ రాశి ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా శనివారం నాడు నలుపు లేదా నీలం రంగు బట్టలను ధరించి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి.
మీన రాశి ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా గురువారం నాడు పసుపు రంగు బట్టలను ధరించి గుడికి వెళ్ళాలి. ఇలాగే ఈ సంవత్సరం అంతా అన్ని రాశుల వారు పాటిస్తే అంతులేని ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది.